చిత్రీకరణలపై ఆంక్షలను తొలగించిన నేపథ్యంలో మూడు నెలల తర్వాత బుల్లితెర కార్యక్రమాలు మళ్లీ ప్రారంభమయ్యాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే కళాకారులంతా స్టూడియోలకు భారీ ఎత్తున తరలివచ్చి తమ కార్యక్రమాల, షోల షూటింగులలో పాల్గొని సరికొత్త ఎపిసోడ్లను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. దీంతో బుల్లితెర ప్రేక్షకులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. భారతదేశంలో అత్యంత ప్రఖ్యాతి గాంచిన జబర్దస్త్ కామెడీ షో కూడా జూన్ 26వ తేదీన సరికొత్త ఎపిసోడ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి బుల్లితెర ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేసింది. ఈ సరికొత్త జబర్దస్త్ ఎపిసోడ్స్ లో తాగుబోతు రమేష్, శకలక శంకర్ కూడా బ్రహ్మాండమైన స్కిట్స్ చేసి బుల్లి తెర ప్రేక్షకులను ఫుల్ గా నవ్వించారు. 


అయితే జులై 2వ తేదీన ప్రసారమవ్వనున్న సరికొత్త జబర్దస్త్ ఎపిసోడ్ కూడా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఈ జబర్దస్త్ ఎపిసోడ్ షూటింగ్ నానక్ రామ్ గూడ లోని రామానాయుడు స్టూడియోలో జరిగిందని తెలుస్తుంది. కాగా ఇందులో అనసూయ యాంకర్ గా, రోజా, మనో న్యాయనిర్ణేతలుగా కనిపించారు. కొన్ని వారాల క్రితం అనసూయ, రష్మి జబర్దస్త్ షో నుండి తొలగించబడ్డారు అనే వార్తలు వెల్లువెత్తాయి కానీ అందులో నిజం లేదని తెలిసింది. ప్రస్తుత విపత్కర సమయాలలో చిత్ర షూటింగ్ లు జరగడం దాదాపు అసాధ్యం. అందుకే అనసూయ రష్మీ కూడా జబర్దస్త్ షో ని అంటిపెట్టుకొని ఉండాలని భావించినట్లు తెలుస్తోంది. 


మూడు నెలల వరకు ఇంటికే పరిమితమైనా జబర్దస్త్ స్క్రిప్ట్ రైటర్స్ కూడా మరింత కిక్ ఇచ్చే కాన్సెప్ట్ లతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. మరోవైపు కరోనా వైరస్ బుల్లితెర నటులపై పంజా విసురుతుంది. దీంతో ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్న చాలా కార్యక్రమాల చిత్రీకరణలకి బ్రేకులు పడుతున్నాయి.  కానీ జబర్దస్త్ యాజమాన్యం మాత్రం అనేక జాగ్రత్తలు తీసుకొని ఎపిసోడ్స్ లను చిత్రీకరిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: