బుల్లితెర మీద సూపర్ హిట్ అయిన ఉత్తరాది సీరియన్ బాలికా వదు. ఇదే సీరియల్ తెలుగు చిన్నారి పెళ్లి కూతురు పేరుతో ప్రసారమై ఘనవిజయం సాధించింది. బుల్లితెర మీద వచ్చిన పాపులారిటీతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది అవికా. నాగార్జున నిర్మాతగా రాజ్ తరుణ్ హీరోగా తెరకెక్కిన ఉయ్యాల జంపాల సినిమాతో హీరోయిన్గా పరిచయం అయ్యింది అవికా. ఈ సినిమా సూపర్ హిట్ అయినా అవికాకు పెద్దగా అవకాశాలు రాలేదు. ఒకటి రెండు సినిమాలు హిట్ అయినా గ్లామర్ హీరోయిన్ ఇమేజ్ను అందుకోలేకపోయింది.
దీంతో ఈ బ్యూటీకి అవకాశాలు తగ్గిపోయాయి. ఇక టాలీవుడ్లో వర్క్ అవుట్ కాదన్న ఉద్దేశంతో బాలీవుడ్ బాట పట్టింది అవికా. అక్కడ సీరియల్స్లో మంచి ఫాలోయింగ్ ఉండటంతో సీరియల్స్లో నటించేందుకు అంగీకరించింది. ససురాల్ సిమర్కా అనే సీరియల్తో మరోసారి సత్తా చాటింది అవికా. ఈ సీరియల్ లో అద్భుతమైన నటనతో పాటు మనీష్ రాయ్ సింఘానీ సరసన మంచి కెమిస్ట్రీ పండించింది.
తెర మీద వీరిద్దరి కెమిస్ట్రీ చూసిన అభిమానులు తెర వెనుక కూడా వీరి మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్ అంటూ చెవులు కొరుక్కున్నారు. ఈ కామెంట్స్ పై అవికా, మనీష్ లు క్లారిటీ ఇవ్వకపోవటంతో నిజంగానే ఎదో ఉందన్న ప్రచారం జరిగింది. వీరిద్దరు ప్రేమలో ఉన్న ప్రచారంతో పాటు ఒక దశలో వీరిద్దరు పెళ్లి చేసుకున్నారన్న టాక్ కూడా వినిపించింది. అయితే తాజాగా ఈ వార్తలపై మనీష్ స్పందించాడు. మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ మాత్రమే.. మా మధ్య అంతకు మించి ఏం లేదు. అంటే క్లారిటీ ఇచ్చాడు మనీష్. దీంతో ఈ పుకార్లకు ఫుల్స్టాప్ పడినట్టైంది.
ఇక అవికా విషయానికి వస్తే.. చిన్నతనంలో బొద్దుగా ఉన్న ఈ బ్యూటీ సినిమాల్లో నటించిన కొత్తలో ట్రడిషనల్గా నటించిన అవికా ప్రస్తుతం హాట్ హాట్ ఫోటో షూట్లతో అలరిస్తోంది. అదే సమయంలో రిలేషన్ షిప్ రూమర్స్ విషయంలో కూడా వెంటనే రియాక్ట్ అవ్వకుండా వార్తల్లో ఉండేలా చూసుకుంటుంది.