కరోనా వల్ల ఈపాటికే విడుదలకావల్సిన సినిమాల విడుదల ఆగిపోయింది. థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయో కూడా తెలవడం లేదు దాంతో ఎక్కువ కాలం వెయిట్ చేయకుండా థియేటర్ విడుదలను కాదని ఓటిటి లపై మొగ్గు చూపుతున్నారు నిర్మాతలు. ఇప్పటికే అన్ని భాషల నుండి పలు సినిమాలు డైరెక్ట్ గా ఓటిటి లోకి విడుదలయ్యాయి. త్వరలోనే మరికొన్ని సినిమాలు కూడా విడుదలకానున్నాయి. ఇందులో బాలీవుడ్ బడా సినిమాలు కూడా వున్నాయి.  
 
ఇక సమ్మర్ లో విడుదలకావల్సిన సూర్యవన్షి,83 సినిమాలు కూడా డైరెక్ట్ గా ఓటిటి లోకి విడుదల కానున్నాయని ఇటీవల వార్తలు వచ్చాయి అయితే మేకర్స్ మాత్రం అందుకు మొగ్గు చూపడం లేదట. తాజాగా ఈసినిమా విడుదల విషయంలో మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. సూర్యవన్షి, దీపావళికి విడుదలకానుండగా 83 క్రిస్మస్ కు రానుందట. ఈఏడాది బాలీవుడ్ నుండి మచ్ అవైటెడ్ మూవీస్ గా విడుదలకానున్న ఈ రెండు సినిమాలపై భారీ అంచనాలు వున్నాయి. 
 
సూర్యవన్షిలో స్టార్ హీరోలు అక్షయ్ కుమార్,అజయ్ దేవగణ్ ,రణ్వీర్ సింగ్ లు కలిసి నటించగా రోహిత్ శెట్టి తెరకెక్కించాడు. రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ తో కలసి కరణ్ జోహార్ ఈచిత్రాన్ని నిర్మించాడు. ఇక టీమిండియా లెజండరీ కెప్టెన్ కపిల్ దేవ్ జీవితం ఆధారంగా తెరకెక్కింది 83. కబీర్ ఖాన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ , కపిల్ దేవ్ పాత్రలో నటించగా కపిల్ దేవ్ భార్య రోమి దేవ్ పాత్ర లో రణ్వీర్ సతీమణి దీపికా పదుకొనే కనిపించనుంది. ఈసినిమా హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో విడుదలకానుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: