దర్శకుడు ఈ వీ వీ సత్యనారాయణ వారసుడి గా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన అల్లరి నరేష్‌, మినిమమ్‌ గ్యారెంటీ హీరోగా సత్తా చాటాడు. వరుస విజయాలతో కామెడీ చిత్రాల స్టార్‌ గా ఎదిగిన నరేష్‌, ఇటీవల ఆ స్థాయి లో అలరించ లేకపోతున్నాడు. వరుస ఫెయిల్యూర్స్‌ తో ఫాం కోల్పోయాడు. దీంతో ఇటీవల సినిమాలు చేయటంతో వేగం తగ్గించిన నరేష్‌ త్వరలో డిఫరెంట్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు.

 

దర్శకుడు సతీష్‌ వేగేశ్న నిర్మాత మారి తెరకెక్కిస్తున్న నాంధీ సినిమా లో సీరియస్‌ రోల్‌ లో కనిపించనున్నాడు నరేష్‌. ఈ రోజు నరేష్‌ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టీజర్‌ రిలీజ్‌ అయ్యింది. అన్యాయంగా ఓ కేసులు ఇరికిచబడ్డ వ్యక్తి పాత్ర లో నరేష్ కనిపిస్తున్నాడు. నరేష్‌ స్నేహితుడిగా ప్రవీణ్, లాయర్‌ గా వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ నటిస్తున్న ఈ సినిమా టీజర్‌ ఆసక్తికరంగా ఉంది.

 

ఈ నేపథ్యం లో టీజర్‌ పై స్పందించిన యంగ్ హీరో నాని నరేష్‌ కు శుభాకాంక్షలు తెలియజేశాడు. `అదిరింది రా! నీకు సరికొత్త అవతారానికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. నాంది సినిమా కోసం వెయిట్‌ చేస్తున్నా` అంటూ కామెంట్‌ చేశాడు నాని. విజయ్ కనకమేడల దర్శకత్వంలో తెరకెక్కిన నాంధి సినిమాలో `మ‌నిషి పుట్ట‌డానికి కూడా తొమ్మిది నెల‌లే టైమ్ ప‌డుతుంది.. కానీ న్యాయం చెప్ప‌డానికేంటి సార్ ఇన్ని సంవ‌త్స‌రాలు ప‌డుతోంది` అంటూ నరేష్‌ చెప్పిన డైలాగ్‌ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: