బెలూన్ సినిమా ఓటీటీ లో రిలీజ్ అవుతోంది. అయితే ఈ సినిమా గురించి కొత్త అప్డేట్స్ తెలుసుకోవాలంటే దీనిని చదవండి. హీరోయిన్ అంజలి, హీరో జై, జనని అయ్యర్ ఈ సినిమా లో ప్రధాన పాత్రలు చేస్తున్నారు. బెలూన్ సినిమాలో రాజ్ తరుణ్ అతిధి పాత్ర చేస్తున్నాడు. ఈ సినిమాకి శినీష్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను దిలీప్ సుబ్బరాయన్, అరుణ్ బాలాజీ, నంద కుమార్ సంయుక్తంగా నిర్మించారు. ఓటీటీ జి5 లో ఈ సినిమా జూలై 10న విడుదల అవుతుందని జీ5 ప్రకటించింది.
ఇదిలా ఉంటే ఈ సినిమా స్ఫూర్తి దాయక వెబ్ సిరీస్ లూజర్ వీక్షకులకు అమితంగా ఆకట్టుకుంది. లాక్ డౌన్ లో తెలుగు ప్రజలకు జీ ఫైవ్ నుంచి కాలక్షేపం ఎంతగానో అందించింది. అమృతం ద్వితీయం కూడా బాగా ఆకట్టుకుంది. బెలూన్ సినిమా నిజంగా ప్రేక్షకులను ఎంతగానో ఎదురు చూసేలా చేస్తోంది. కేవలం ఇది మాత్రమే కాకుండా ఇటీవల విడుదలైన 47 థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. అలానే ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ కూడా లభించింది.
ఓటీటీ రిలీజ్ సినిమాలకు మంచి రెస్పాన్స్ నిలిచింది అయితే ఈ సినిమా త్వరలో అనగా జూలై 10న విడుదల కానుంది. బెలూన్ కథ విషయానికి వస్తే జీవా ఆనంద్ జై పాత్రలో నటించనున్నాడు. తాను స్క్రిప్ట్ వ్రాయాలని తన భార్య అంజలి, మేనల్లుడు మాస్టర్ రిషి తో కలిసి ఊటీ కి వెళ్తాడు. వీళ్లంతా అక్కడ ఒక పాత ఇంట్లో ఉంటారు. అప్పుడు ఆ సమయం లో గతం గుర్తు వచ్చి ఊహించని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. మిగిలిన కథ చూడాలంటే జూలై 10 వరకు వేచి ఉండాలి. మరి ఈ హారర్ కామిడి ఎలా ఆకట్టుకుంటుందో చూడాలంటే జూలై పది వరకు అంతా ఆగక తప్పదు.