యాంకర్ సుమ అలీలు కలిసి ఒక టివి షోలో పాల్గొన్నారు అంటే అందులో జోక్ లకు పంచ్ లకు లోటు ఉండదు నిన్నరాత్రి కూడ అదే జరిగింది. ప్రస్తుతం కొనసాగుతున్న కరోనా సమస్యలు లాక్ డౌన్ కారణాలు వల్ల అనేకమంది తమ ఉపాధిని కోల్పోతున్నారు. ఇప్పుడు తనకు కూడ అలాంటి సమస్యలు ఎదురయ్యాయి అంటూ సుమ చేసిన కామెంట్స్ ఆ షోకు హైలెట్. 


యాంకర్ ప్రదీప్ తో కలిసి సుమ పాల్గొన్న ఈ షోలో అలీ అనేకరకాలైన విచిత్ర ప్రశ్నలు అడిగి సుమను కార్నర్ చేయడానికి ప్రయత్నించాడు. అయితే ఈ ప్రయత్నాలకు సుమ ధీటుగా సమాధానాలు ఇచ్చింది. గత మూడు నెలలుగా కొనసాగుతున్న లాక్ డౌన్ పరిస్థితులు వల్ల తన ఆస్తులు అన్ని కరిగిపోయాయి అంటూ సుమ చేసిన కామెంట్స్ ప్రస్తుత ఫిలిం ఇండస్ట్రీ టీవి ఇండస్ట్రీ పరిస్థితులను తెలియచేస్తోంది.


ఇదే సందర్భంలో సుమ రాజకోయల్లోకి వెళ్లనుందా అని అడిగిన అలీ సందేహానికి సుమ ఉహీంచని సమాధానం ఇచ్చింది. మొదట కొంత గ్యాప్ ఇచ్చి సీరియస్ లుక్స్ ఇచ్చి రాజకీయాలు తనకు వద్దు అంటూ కామెంట్స్ చేసింది. ఇదే సందర్భంలో మరొకసారి అలీ సుమను ఇరికించదానికి ప్రయత్నిస్తూ ఈ సమయంలో మల్లెపూలు ఎక్కడ దొరికాయి అన్నప్రశ్నకు సమాధానం ఇస్తూ మగవాళ్ళకు మందు బాటిల్స్ ఆడవాళ్ళకు ఎక్కడ దొరుకుతాయో తెలుసు అంటూ మరో జోక్ చేసింది. 


సుమ ఈషోలో ఈ కరోనా పరిస్థితులు వల్ల తన ఆస్థులు అన్నీ పోయాయి అన్న మాటలు విన్న ఇండస్ట్రీ వర్గాలు మాత్రం సుమను ప్రశంసిస్తూ సుమ మాటలు నేటి ఇండస్ట్రీ వాస్తవ పరిస్థితికి అడ్డం పట్టినట్లు ఉన్నాయి అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. సినిమా ఫంక్షన్స్ కు యాంకరింగ్ చేయడానికి గంటకు లక్షలలో పారితోషికం తీసుకునే సుమ గత మూడు నెలలుగా సినిమా ఫంక్షన్స్ లేకపోవడంతో ఇలా భావోద్వేగానికి లోనై ఆస్థులు కరిగిపోయాయి అన్న ఫీలింగ్ లోకి వెళ్ళిపోయినట్లు ఉంది..

మరింత సమాచారం తెలుసుకోండి: