అర్జున్ రెడ్డి సినిమా తో ఓవర్ నైట్ లోనే టాలీవుడ్ పరిశ్రమలో పెద్ద సంచలనమే సృష్టించి ఎంతో పాపులారిటీ సంపాదించిన డాషింగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ, హీరో విజయ్ దేవరకొండ కలిసి మళ్ళీ ఒక సినిమా చేస్తున్నారని వార్తలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సినిమా అర్జున్ రెడ్డి కి సీక్వెన్స్ అని కొంతమంది అంటుంటే... ఈసారి సందీప్ రెడ్డి వంగ పూర్తి భిన్నమైన కథతో విజయ్ దేవరకొండని సరికొత్త అవతారంలో చూపించనున్నాడని మరి కొంతమంది అంటున్నారు.


ఈ లాక్ డౌన్ సమయంలో సందీప్ రెడ్డి వంగా రెండు కథలను రాసుకున్నాడట. వాటిలో ఒకటి విజయ్ దేవరకొండ తో తీయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. సందీప్ రెడ్డి వంగా హిందీ తమిళ భాషలలో కూడా అర్జున్ రెడ్డి సినిమాని ఇతర హీరోలను పెట్టి తెరకెక్కించి ఆ హీరో హీరోయిన్లకు ఎప్పుడూ రాని క్రేజ్ ని సంపాదించి పెట్టాడు. అర్జున్ రెడ్డి రీమేక్ అయిన కబీర్ సింగ్ సినిమాలో షాహిద్ కపూర్, కియారా అద్వానీ హీరో హీరోయిన్ గా నటించగా... మురాద్ ఖేతాని, అశ్విన్ వర్దే, భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్ కలిసి సినీ1 స్టూడియోస్, టీ సిరీస్ బ్యానర్ ల కింద నిర్మించారు. అయితే కబీర్ సింగ్ సినిమా నిర్మించిన టీ-సిరీస్ భూషణ్ కుమార్, సినీ 1 స్టూడియోస్ మురాద్ ఖేతాని కలసి సందీప్ రెడ్డి వంగా తో ఒక భారీ బడ్జెట్ సినిమా చేయాలని ఆలోచిస్తున్నారట. అయితే ఈ భారీ బడ్జెట్ సినిమా ప్రాజెక్ట్ కి ఒరిజినల్ అర్జున్ రెడ్డి సినిమా నిర్మాత, సందీప్ సోదరుడు అయిన ప్రణయ్ కూడా నిర్మాతగా బాధ్యతలు చేపట్టనున్నారని తెలుస్తోంది. ఈ భారీ బడ్జెట్ చిత్రంలో ఎవరు నటిస్తారన్నది తెలియాల్సి ఉంది.


ఇకపోతే విజయ్ దేవరకొండ కోసం సందీప్ రెడ్డి వంగ రాసుకున్న కథ ఎలా ఉండబోతోందన్న అంశం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. విజయ్ దేవరకొండ ని వెండితెరపై సూపర్ గా చూపించగల టాలెంట్ కేవలం సందీప్ రెడ్డికి మాత్రమే వుందని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. వరస ఫ్లాపుల సినిమాలతో తన పాపులారిటీని నిలబెట్టుకోవడానికి కష్టపడుతున్న విజయ్ దేవరకొండ కి త్వరలోనే మళ్లీ ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్టు ఇవ్వడానికి సందీప్ రెడ్డి ప్రిపేర్ అవుతున్నాడని అభిమానులంతా తెగ సంబరపడిపోతున్నారు. వీళ్ళిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుందో రాదో తెలియాలంటే అధికారికంగా ప్రకటన వెలువడే వరకు వేచి చూడాల్సిందే.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: