కరోనా రేపిన కల్లోలానికి ప్రపంచం మొత్తం వణికిపోతోంది. రోజురోజుకీ పెరిగిపోతున్న కేసులు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. రీసెంట్ గా బిగ్ బీ ఫ్యామిలీ కరోనాకు ఎఫెక్ట్ కావడంతో సామాన్యులను ఆలోచనలో పడేసింది. కరోనా సోకకుండా స్వీయ జాగ్రత్తలు తీసుకోవడం మార్గమైతే.. కరోనా సోకిన వారికి ప్రస్తుతం ప్లాస్మా థెరపీ సంజీవనిలా మారుతోంది. ప్రస్తుతం అంతా ప్లాస్మా దానం చేయడంపై అవగాహన పెంచుతున్నారు. ఈ నేపథ్యంలో సినీ ఇండస్ట్రీ ఒక అడుగు ముందుకేసింది. హీరో శ్రీవిష్ణు ఇందుకు నాంది పలికాడు. ఇందుకు ట్విట్టర్ ను వేదిక చేసుకున్నాడు.

IHG

 

‘ప్లాస్మా దానంపై ప్రజల్లో అవగాహన పెరగాలి. కరోనా రోగులు కోలుకునేందుకు ప్లాస్మా దానం ఎంతో ముఖ్యం’ అంటూ కొత్తగా ట్విట్టర్లో ఛాలెంజ్ విసిరాడు. హీరో నారా రోహిత్, హీరోయిన్ నివేధా థామస్ కు ఈ ఛాలెంజ్ విసిరాడు. ఇందుకు తన డీపీని కూడా ‘డొనేట్ ప్లాస్మా.. సేవ్ లైఫ్’ అనే పిక్ పెట్టుకున్నాడు. ప్రస్తుత కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్లాస్మా దానం ప్రముఖంగా వార్తల్లో నిలుస్తోంది. కరోనా నుంచి కోలుకున్న వారు ప్లాస్మా దానం చేస్తే కరోనాతో పోరాడేవారి ప్రాణాలు కాపాడేందుకు ఉపయోగపడుతుందని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో శ్రీ విష్ణు విసిరిన ఛాలెంజ్ ఆసక్తి రేపుతోంది.

IHG

 

శ్రీవిష్ణు ఛాలెంజ్ ను యాక్సెప్ట్ చేసిన నారా రోహిత్ తన డీపీని మార్చాడు. అల్లరి నరేశ్, మంచు మనోజ్ కు ఈ ఛాలెంజ్ విసిరాడు. సోషల్ మీడియాలో నిత్యం ఏదొక ఛాలెంజ్ వైరల్ అవుతూనే ఉంటుంది. ఇటివలే బి ద రియల్ మ్యాన్ చాలెంజ్ కూడా ఫేమస్ అయినట్టు శ్రీవిష్ణు ఛాలెంజ్ కూడా వైరల్ అయితే ఎందరికో ఉపయోగపడుతుంది. మరి దీనిని సినిమా పరిశ్రమ మరింత ముందుకు తీసుకెళ్తుందో లేదో వేచి చూడాల్సిందే.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: