నాని హీరోగా నటించిన జెంటిల్ మెన్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన నివేదా థామస్ తదనంతరం నిన్నుకోరి సినిమాలో నటించి లక్షల మంది తెలుగు సినిమా ప్రేక్షకులకు ఫేవరెట్ హీరోయిన్ అయిపోయింది. 2017 వ సంవత్సరం లో విడుదలైన నిన్నుకోరి సినిమాలో ఆమె అందచందాలకు, నటనా ప్రతిభకు విమర్శకులు కూడా తెగ ఫిదా అయిపోయి బాగా ప్రశంసించారు. అగ్రహీరో ఎన్టీఆర్ సరసన కూడా జై లవకుశ సినిమాలో నటించి ప్రేక్షకులను మెప్పించింది నివేదా థామస్. బ్రోచేవారెవరురా, దర్బార్ 
వంటి చిత్రాల్లో నటించిన నివేదా థామస్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న వకీల్ సాబ్ చిత్రంలో కూడా నటిస్తోంది. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

Calling this, singing attempts.. #quarantinechoir

A post shared by nivetha Thomas (@i_nivethathomas) on


ఈ 24ఏళ్ల కేరళ కుట్టి వెండితెర మీదే కాదు సోషల్ మీడియాలో కూడా అభిమానులను అలరిస్తుంది. సన్ టీవీ ధారావాహికలో బాలనటిగా నటించిన నివేదా థామస్ ఆ తర్వాత హీరోయిన్ గా అవతారమెత్తి ప్రేక్షకుల మనసులను చూరగొన్నది. సోషల్ మీడియాలో అరంగేట్రం చేసి కొద్ది సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఆమెకు దాదాపు 40 లక్షల మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందంటే అతిశయోక్తి కాదు. పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న వకీల్ సాబ్ లో నివేద థామస్ కూడా నటిస్తుండడంతో అతని అభిమానులు కూడా సినిమా అప్డేట్ కోసం ఆమెను ఫాలో అవుతున్నారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

Look trials for a scene from 😊 #VTheMovie

A post shared by nivetha Thomas (@i_nivethathomas) on


నివేదా థామస్ పాటలు కూడా చాలా చక్కగా పాడుతుంది. తాజాగా ఆమె ఒక హిందీ పాట పాడి దానికి సంబంధించిన వీడియోని ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసి అభిమానులను ఆశ్చర్య పరిచింది. నివేదా థామస్ సోషల్ మీడియా లో ఎక్కువగా సంప్రదాయకంగా కనిపిస్తుంటుంది. ఎక్స్పోజింగ్ చేయడానికి అంతగా ఇష్టపడని ఆమెకు డీసెంట్ అభిమానులు విపరీతంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం కరోనా మహమ్మారి నేపథ్యంలో ఆమె ఇంటికే పరిమితమై సోషల్ మీడియాలో ఎక్కువగా సమయం గడుపుతుంది. ప్రతి ఒక్కరిని తగు జాగ్రత్తలు తీసుకోవాలి అంటూ సూచిస్తుంది కూడా. ఏదేమైనా తరచుగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులను ఎంటర్టైన్ చేస్తుంది నివేదాథామస్.

మరింత సమాచారం తెలుసుకోండి: