బాలీవుడ్‌ యువ నటుడు సుశాంత్‌ సింగ్ రాజ్‌పుత్ మరణించి నెల రోజులు గడుస్తున్నా ఆయన సన్నిహితులు ఆ బాధ నుంచి బయట పడలేకపోతున్నారు. ఇప్పటికీ ఏదో ఒక రకంగా సుశాంత్‌ను గుర్తు చేసుకుంటునే ఉన్నారు అభిమానులు ముఖ్యంగా మంగళవారానికి సుశాంత్‌ మరణించి నెల రోజులు గడుస్తుండటంతో మరోసారి యంగ్ హీరోను తలునుకొని భావోద్వేగానికి లోనయ్యారు. సుశాంత్ చివరి చిత్రం హీరోయిన్‌ సంజన సంఘీ తన ఫీలింగ్స్‌ను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది.

 

ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో `కాలం గాయాలను మానుస్తుందని ఎవరు చెప్పారు. అది అబద్ధం. అప్పటి జ్ఞాపకాలు మళ్లీ మళ్లీ గుర్తుకు వచ్చిన ఇబ్బంది పెడతాయి. ఎన్నో ప్రశ్నలు సమాధానాలు లేకుండా అలాగే మిగిలిపోతాయి. ఆ గాయాల్లోనూ ఓ సినిమా ఉంటుంది. ఆ గాయాల్లో కొన్ని కలలు ఉంటాయి. నేను నీ లాగే కలలను సాకారం చేసేందుకు నేను నా వంతుగా శ్రమిస్తాను. నువ్వు నన్ను అలాగే చూడాలనుకున్నావుగా` అంటూ సుశాంత్ ను తలుచుకుంటూ కామెంట్ చేసింది సంజన.

 

కాస్టింగ్ డైరెక్టర్‌గా పాపులర్‌ అయిన ముఖేష్ చబ్రా దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్న ఈ సినిమా దిల్‌ బెచారా. ఈ సందర్భంగా సుశాంత్ వర్కింగ్‌ స్టిల్స్‌ను కూడా షేర్ చేశాడు దర్శకుడు ముఖేష్. సుశాంత్ చివరి చిత్రం దిల్‌ బెచారా జూలై 24న ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: