లాంగ్ గ్యాప్ తీసుకుని అందరికీ గుర్తుండిపోయేలా 'అలా వైకుంఠపురం లో' సినిమా చేసి ఏడాది ప్రారంభంలో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు అల్లు అర్జున్. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' అనే సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ గంధపు చెక్కల స్మగ్లర్ గా లారీ డ్రైవర్ పాత్రలో ఊర మాస్ క్యారెక్టర్ లో నటిస్తున్నట్లు ఫిలింనగర్ లో వార్తలు వస్తున్నాయి. పాన్ ఇండియా తరహాలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇటీవల అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన ‘పుష్ప’ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

 

ఇదిలా ఉండగా ‘యాత్ర’ సినిమా డైరెక్టర్ మహి వి రాఘవ చెప్పిన స్టోరీ కి అల్లు అర్జున్ ఫిదా అయినట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు అల్లు అర్జున్ వినని స్టోరీ చెయ్యని క్యారెక్టర్ లో 'యాత్ర' డైరెక్టర్ చూపించడానికి రెడీ అవుతున్నట్లు ఇప్పటికే అల్లు అర్జున్ కి స్క్రిప్ట్ వినిపించినట్లు సమాచారం. రాజకీయ నేపథ్యంలో అల్లు అర్జున్ పాత్ర ఉంటుందని, ఊహించని రీతిలో అల్లు అర్జున్ సినిమాలో ముఖ్యమంత్రిగా కనిపించబోతున్నాడని సినిమా కథ అదిరిపోతుందని ఫిలింనగర్ లో వార్తలు వస్తున్నాయి.

 

కాగా ఈ సినిమా స్క్రిప్ట్ లో బన్నీ కొన్ని మార్పులు చేర్పులు మహి వి రాఘవకి సూచించినట్లు ఆ తర్వాత స్క్రిప్టు విని ఈ ప్రాజెక్ట్ కి అల్లు అర్జున్ సైన్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు టాక్. దీంతో రాజకీయ నేపథ్యంలో అంటే బన్నీ సినిమా కొత్తగా ఉంటుంది, కాబట్టి సినిమా ఓకే చేస్తే బన్నీ అభిమానులకు ఇది పండగే అని సినిమా విశ్లేషకులు అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: