గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ప్రముఖ యాంకర్ ఉదయభాను దగ్గర్నుండి ఛాలెంజ్ ను స్వీకరించి ఈరోజు తన నివాసం వద్ద ఫ్యామిలీతో కలిసి మొక్కలు నాటాడు యంగ్ డైరెక్టర్ సంపత్ నంది. అనంతరం ఈకార్యక్రమానికి శ్రీకారం చుట్టిన టీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ కు కృతఙ్ఞతలు తెలిపి సీనియర్ హీరోయిన్ భూమిక ,యంగ్ హీరోయిన్ దిగంగన సూర్యవంశీ అలాగే బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతేలాను ఈగ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు నామినేట్ చేస్తున్నట్లు సంపత్ నంది ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు. 
ఇక సంపత్ ఈముగ్గురునే ఎందుకు ఎంచుకున్నాడంటే.. గౌతమ్ నంద తరువాత అతను తెరకెక్కిస్తున్న చిత్రం సీటీమార్. ఈచిత్రంలో భూమిక , దిగంగన సూర్యవంశీ కీలక పాత్రల్లో నటిస్తుండగా ఊర్వశి రౌతేలా స్పెషల్ సాంగ్ లో కనిపించనుంది దాంతో ఈఛాలెంజ్ కోసం వీరిని ఎంచుకున్నాడు. కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈచిత్రంలో గోపిచంద్, హీరోగా నటిస్తుండగా తమన్నా, హీరోయిన్ గా నటిస్తుంది.
 
కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈచిత్రంలో గోపిచంద్, హీరోగా నటిస్తుండగా తమన్నా, హీరోయిన్ గా నటిస్తుంది కాగా తమన్నా తెలంగాణ టీం కు కబడ్డీ కోచ్ గా కనిపించనుండగా ఆంధ్రా కబడ్డీ టీం కోచ్ గా గోపిచంద్ నటిస్తున్నాడు. 50శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈచిత్రం ఆగస్టు నుండి తిరిగి సెట్స్ మీదకు వెళ్లనుంది. సింగిల్ షెడ్యూల్ లో మిగితా చిత్రీకరణను పూర్తి చేయనున్నారు. యూటర్న్ నిర్మాత శ్రీనివాస్ చిట్టూరి ఈసినిమాను నిర్మిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: