టాలీవుడ్లో ఇటీవల పలు సినిమాలపై కాపీ దుమారం చెలరేగుతోంది. సినిమా రిలీజ్కు ముందో లేదా ఆ తర్వాతో తమ కథలనే వాడుకున్నారని చాలా మంది మీడియా ముందుకు వచ్చి హడావిడి చేయడం... ఫలితంగా ఆ సినిమాకు రిలీజ్కు ముందే కావాల్సినంత హైప్ రావడం జరుగుతూ వస్తోంది ఇక తాజాగా హిట్ టాక్ తెచ్చుకున్న సూపర్స్టార్ మహేష్బాబు మహర్షి సినిమా సైతం ఇప్పుడు కాపీ క్యాట్ ఆరోపణల్లో చిక్కుకున్నట్టు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
మహర్షి థీయ్ తాను అనుకున్న లైనేనని... ఇది తన ఇమాజినేషన్ నుంచే పుట్టిందని దర్శకుడు శ్రీవాస్ ఫీలయ్యాడట. ఈ సినిమా చూసిన వెంటనే ఇదే విషయంపై నేరుగా దిల్ రాజునే ప్రశ్నించారట. తన బేసిక్ పాయింట్ యూజ్ చేసుకున్నట్టు దర్శకుడు వంశీ కాని, నిర్మాత దిల్ రాజు కాని తనను సంప్రదించలేదని ఫీల్ అయిన శ్రీవాస్... ఈ విషయాన్ని పెద్దది చేయకుండా కేవలం రాజుతో ఆర్గ్యు చేసి అక్కడితో వదిలేసినట్టు తెలుస్తోంది.
దీనిపై దర్శకుల సంఘంలో ఫిర్యాదు చేయకుండా వదిలేసినందుకు శ్రీవాస్కు ప్రతిపలంగా దిల్ రాజు బ్యానర్లో ఓ సినిమా చేసే ఛాన్స్ వచ్చినట్టు కూడా ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలోనే శ్రీవాస్ దిల్ రాజు బ్యానర్లో ఓ సినిమా చేశాడు. ఆ బ్యానర్లో రామ్ హీరోగా రామ రామ కృష్ణ కృష్ణ సినిమాని తెరకెక్కించారు. ఆ సినిమా ఆశించినంత ఫలితం దక్కించుకోలేదు. ఇక ఇప్పుడు మరోసారి ఇలా శ్రీవాస్కు రాజు బేనర్లో సినిమా చేసే ఛాన్స్ వచ్చింది.