అప్పటి వరకు అందరితో సరదాగా ఉన్న శ్రీహరి సడెన్ లేరు అని తెలిసే సరికి అంతా షాక్ అయ్యారు.  శ్రీహరి మరణంపై అనుమానాలు ఉన్న అవి బయటకు రాలేదు.  రీసెంట్ గా శ్రీహరి భార్య డిస్కోశాంతి అయన మరణం గురించిన కొన్ని విషయాలను చెప్పింది.  షూటింగ్ కోసం ముంబైలో హోటల్ ఉన్నారట.

షూటింగ్ ముగించుకొని తిరిగి వచ్చిన శ్రీహరి తిని టివి చూస్తుండగా ఒళ్ళంతా చమట్లు పట్టాయి.  వెంటనే రిసెప్షన్ కు ఫోన్ చేసి డాక్టర్ ను పిలిస్తే.. అయన వచ్చి ఇంజక్షన్ చేశారట.  డిస్కోశాంతి లోపలికి బట్టలు మార్చుకొని వచ్చే సరికి శ్రీహరిని హాస్పిటల్ కు తీసుకెళ్లారు.  


శ్రీహరి బట్టలన్నీ రక్తంతో నిడిపోయాయని ఆమె చెప్పింది.  లీలావతి హాస్పిటల్ కు తరలించారు. అందరు వస్తున్నారుగాని, తనను మాత్రం లోపలికి పంపలేదట.  ఫోన్ చేస్తే తమ్ముడు, చెల్లెలు వచ్చారట.  శ్రీహరి లివర్ కు సంబంధించిన వ్యాధితో బాధపడుతుండగా లోపలికి పైప్ వేసే సమయంలో జరిగిన పొరపాటు వలన శ్రీహరి మరణించారని డిస్కోశాంతి తెలిపింది.  


శ్రీహరి లాంటి నటుడు సినిమా ఇండస్ట్రీకి మరొకరు దొరుకుతారు అనుకోవడం కష్టమే.  శ్రీహరి తన నటనతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోగా, విలన్ గా మెప్పించారు.  ప్రస్తుతం శ్రీహరి కొడుకు రాజ్ దూత్ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు.  


మరింత సమాచారం తెలుసుకోండి: