రాజమౌళి సినిమా అంటేనే ఓ క్రేజ్ ఉంటుంది. ఈ క్రేజ్ కు తగ్గట్టుగా సినిమాను ప్లాన్ చేసుకొని ప్రమోట్ చేసుకుంటున్నాడు. ఇప్పటికే అంచనాలు భారీగా ఉన్నాయి. సమాచారం ప్రకారం బిజినెస్ కూడా జరిగిపోయిందని తెలుస్తోంది. 1800 కాలం నాటి కథతో తెరకెక్కిస్తున్న సినిమా.
అంతేకాదు, ఆ కాలన్నీ ఇప్పటి కాలంతో ముడిపెడుతూ సినిమా తీస్తున్నారు. పీరియాడికల్ స్టోరీ కావడం విశేషం. ఇలాంటి కథలతో సినిమాలు చేయడం అంటే రాజమౌళికి చాలా ఇష్టం. అందుకే వీటిని ఎంచుకుంటుంటారు. ఎన్టీఆర్ కొమరం భీం గా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు.
వీరి ఇంట్రో సీన్స్ కోసం ఏకంగా 60 కోట్లు ఖర్చు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ స్థాయిలో ఖర్చు చేస్తున్నారు అంటే అర్ధం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటె, ఈ మూవీకి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. బాహుబలి నిర్మాతలు ఈ మూవీని టేకోవర్ చేసుకోవాలని చూస్తున్నారట.
సినిమాకు పెడుతున్న బడ్జెట్ కంటే మరో వంద కోట్లు ఎక్కువగా ఇస్తామని, సినిమాను తమకు అప్పగించాలని బాహుబలి నిర్మాతలు డివివి దగ్గర ప్రపోజల్ పెట్టినట్టు సమాచారం. కానీ, దీనికి డివివి ఒప్పుకోలేదని తెలుస్తోంది. వందకోట్లు అదనంగా ఇస్తామని బాహుబలి నిర్మాతలు వచ్చారంటే.. సినిమాకు ఎంత క్రేజ్ ఉన్నదో అర్ధం చేసుకోవచ్చు.