ఒరిజినల్ వెర్షన్ లో నానా పటేకర్ పోషించిన పాత్రను ఈ రీమేక్లో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ చేయనుండగా కృష్ణవంశీ సతీమణి రమ్యకృష్ణ కూడా ఓ కీలక పాత్ర లో నటించనుంది. ఇక తాజాగా ఈ చిత్రం యొక్క టైటిల్ ను కూడా రివీల్ చేశారు. రంగస్థలం నటుడి కథ తో తెరకెక్కనున్న ఈ చిత్రానికి 'రంగ మార్తాండ' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు . రెడ్ బుల్ ఎంటర్ టైన్మెంట్స్, హౌస్ ఫుల్ మూవీస్ బ్యానర్ల పై అభిషేక్ జ్వకర్ , మధు కలిపు నిర్మించనున్న ఈ చిత్రం అతి త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. మరి ఈ చిత్రం తో కృష్ణవంశీ హిట్ కొట్టి మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడో లేదో చూడాలి.
ఇదిలా ఉంటే కృషవంశీ ఆల్ టైం హిట్ 'అంతఃపురం' ను ఇంతకుముందు హిందీలో శక్తి పేరుతో రీమేక్ చేయగా ప్రకాష్ రాజ్ పోషించిన పాత్రలో నానా పటేకర్ నటించాడు. ఈ చిత్రాన్ని కూడా కృష్ణవంశీనే డైరెక్ట్ చేశాడు.