ప్రస్తుతం కొంచెం కూడా తీరిక లేకుండా,చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు యంగ్ హీరో నితిన్. ఇటీవల బాలీవుడ్ లో రిలీజ్ అయ్యి సూపర్,డూపర్ హిట్ కొట్టిన సినిమా అంధదూన్,ప్రస్తుతం తెలుగులో రీమేక్ రైట్స్ తీసుకున్న సంగతి అందరికి తెలిసిందే. నితిన్ ఈ రీమేక్ సినిమాకు, డైరెక్టర్ ని కూడా తానే సెలెక్ట్ చేస్తున్నారు అని ఆ మధ్య పేర్కొనారు. డిసెంబర్ 21న రిలీజ్ కి సిద్ధం అవుతున్న తన భీష్మ సినిమా షూటింగ్ లో
నితిన్ ఇప్పుడు చాలా బిజీగా ఉండటం,వల్ల ఈ సినిమాని ఎప్పుడు ప్రారంభిస్తున్నారో, ఎవరితో చేస్తున్నారు అన్న వివరాలు ఇంకా క్లారిటీ లేదని ఆయన చెప్పుకొచ్చారు.
అసలు నితిన్ ఆ సినిమాను వెంటనే రీమేక్ చేస్తున్నారనే వార్త చాల జోరుగా వినిపించింది.ప్రస్తుతం చూస్తే నితిన్ తన పని తాను తీసుకుంటూ వెళ్తున్నారు.ఎక్కడా తీరిక లేకుండా,ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా,ఒక సినిమా తర్వాత మరొకటి చేస్తూ,వరుసగా మూడు సినిమాలు చేస్తున్నారు నితిన్.దీనితో పాటు ఇదివరకే అనౌన్స్ చేసిన కృష్ణ చైతన్య సినిమా కూడా పెండింగ్ లో ఉంచారు. ఆ సినిమా తాలూకు స్క్రిప్ట్ మొత్తం రెడీ గా ఉంది అని,నితిన్ అనుకున్న వెంటనే, సినిమా మొదలవుతుంది అని చెప్పారు. ఈ సినిమా నితిన్ తన సొంత బ్యానర్ లోనే చేయనున్నారని పేర్కొన్నారు.
అయితే ఈ సినిమాలు అన్ని పూర్తి చేసుకొని,నితిన్ ఆ రీమేక్ ను ఎప్పుడు మొదలు పెడతారు? ఎవరితో చెయ్యనున్నారు అని,అసలు ఇప్పుడు చేస్తాడా లేదా అన్న విషయం పైచర్చ సాగుతుంది. నితిన్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేసి,వేరే హీరోతో చేసే ప్లాన్ లో ఉన్నారా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమయినా
నితిన్ నుండి తొందర్లో ఈ రీమేక్ మూవీకి సంబంధించిన అప్డేట్ వస్తే తప్పా ఏమి చెప్పలేని పరిస్థితి అంటున్నారు. అసలు నితిన్ నుండి ఎప్పుడు అప్డేట్ వస్తుందో వేచి చూడాల్సిందే..