సూపర్ స్టార్ రజినీకాంత్ వయసు తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ యంగ్ హీరోలకు గట్టి పోటీనిస్తున్నాడు. రజినీ ఈ ఏడాది ప్రారంభంలో పేట తో ప్రేక్షకులముందుకు
రాగ ఆ చిత్రం విజయాన్ని సాధించింది. ఇక పేట తరువాత పెద్దగా గ్యాప్ తీసుకుకుండా రజినీ వెంటనే స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురగదాస్ డైరెక్షన్ లో దర్బార్ చిత్రాన్ని మొదలు పెట్టాడు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తైయింది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రజినీ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనుండగా ఆయనకు జోడిగా
నయనతార నటించింది. రజినీ-మురగదాస్ కాంబినేషన్ లో వస్తున్న మొదటి సినిమా కావడంతో దర్బార్ పై తమిళ్ తో పాటు తెలుగులోనూ భారీ అంచనాలు వున్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదలకానుంది.
ఇదిలా ఉంటే ఈసినిమా సెట్స్ మీద వుండగానే ఇటీవల అజిత్ తో విశ్వాసం అనే చిత్రాన్ని తెరకెక్కించి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన మాస్ డైరెక్టర్ శివ డైరెక్షన్ లో నటించడానికి తలైవా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. త్వరలోనే ఈ చిత్రం లాంఛ్ కానుంది. మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రం డిసెంబర్ నుండి సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ చిత్రానికి ప్రస్తుతం హీరోయిన్స్ ను వెతికే పనిలో వున్నారు చిత్ర బృందం. అందులో భాగంగా సీనియర్ నటి
జ్యోతిక , మలయాళ నటి మంజూ వారియర్, ట్యాలెంటెడ్
బ్యూటీ కీర్తి సురేష్ పేర్లు పరిశీలనలో వున్నాయి. ఇందులో నుండి ఇద్దరిని ఫైనల్ చేయనున్నారని సమాచారం. ఇమ్మాన్ సంగీతం అందించనున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదలకానుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు వెలుబడనున్నాయి.