తెలుగు చలన చిత్ర సీమలో అద్భుతాలు సృష్టించి... తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్పిన చిత్రం ‘బాహుబలి’. ఎస్ ఎస్ రాజమౌళి రెండు సంవత్సరాలు సదీర్ఘంగా కష్టపడి తెరకెక్కించిన చిత్రం ‘బాహుబలి’. జానపద చిత్రాలకు కొత్త వరవడి సృష్టించి కనీ వినీ ఎరుగని రీతిలో వ్యూజువల్ ఎఫెక్ట్స్ తో సినిమా చూస్తున్నంత సేపు కొత్త అనుభూతి కలిగించే విధంగా తీశారు బాహుబలి. అయితే ఈ సినిమా సీక్వెల్ ‘బాహుబలి 2 ’ త్వరలో షూటింగ్ జరపుకోబోతుంది. అయితే ఈ సినిమాలో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపుతాడు.. కత్తిపోటు కన్నా, బల్లెం పోటు కన్నా వెన్ను పోటు చాలా అపాయం అని ఎందుకు అంటాడు అనే ప్రశ్నలు జనాల్లో టెన్షన్ పుట్టించేలా చేశారు.

‘బాహుబలి 2’ లో సినిమా ఆద్యంతం ఆసక్తి కరంగా ఉండబోతుందట. అయితే ఈ సినిమాలో కొన్న పాత్రలు కూడా కొత్తగా పుట్టుకు వస్తున్నాయని ప్రచారం జరుగుతుంది..ఇప్పటికే తమిళ స్టార్ సూర్య, బాలీవుడ్ హీరోయిన్ మాధురీ దీక్షిత్,ఈ సినిమాలో నటిస్తున్నారంటూ వార్తలు గుప్పుమన్నాయి. ఈ వార్తలను చిత్రయూనిట్ ఖండిస్తున్నా ఈ మాత్రం మీడియాలో హల్చల్ చేస్తోంది. ‘బాహుబలి 2’ లో హాలీవుడ్ నటుడిని తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. నటుడు నతన్ జాన్స్ ఇప్పటికే  ట్రాయ్, మ్యాడ్ మాక్స్ ఫ్యూరి లాంటి సినిమాల్లో నటించారు.  

బాహుబలి పోస్టర్


జయం రవి హీరోగా నటించిన ‘భూలోగం’ సినిమాలో నటించిన జోన్స్ ప్రస్తుతం బాలీవుడ్ యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ హీరోగా నటిస్తున్న ‘ఫ్లైయింగ్ జాట్’ సినిమాలోనూ విలన్గా నటిస్తున్నాడు. బారీ కాయంతో చూడటానికి రెజ్లింగ్ క్రీడాకారుడిలా కనిపించే జోన్స్ నటిస్తే ఈ సినిమాలో మరో హైలెట్ అవుతుందని అంటున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్స్ లో బిజీగా ఉన్న బాహుబలి 2 డిసెంబర్ తొలి వారంలో సెట్స్ మీదకు వెళ్లనుంది. 2016 చివరకల్లా ఈ సినిమాను రిలీజ్ చేయడానికి దర్శకుడు రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: