మెగాస్టార్ చిరంజీవి కి గత కొన్ని రోజులుగా భుజం నొప్పితో బాధపడుతున్నారు. ఇప్పటికే ఈయన చికిత్స కోసం ముంబైలోని బ్రీచ్ కాండి ఆసుపత్రిలో చేరినట్టు సమాచారం. గత కొంత కాలంగా  ఈ భుజం గాయం వలనే చిరు కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కార్యక్రమాలకు కూడా హాజరు కావడం లేదనే వార్తలు వస్తున్నాయి. చిరు ఆసుపత్రిలో చేరారన్న విషయం తెలుసుకున్న మెగా అభిమానులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.  ముంబైలోని బ్రీచ్ కాండీ ఆస్పత్రిలో భుజానికి ఆయన శస్త్రచికిత్స చేయించుకోనున్నారని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.

వాస్తవానికి ఈ గాయం కారణంగా ఆయన షూటింగ్  సినిమా వాయిదా వేస్తూ వస్తున్నారా అని సందేహాలు కలుగుతున్నాయి. ఏది ఏమైనా మెగాస్టార్ కత్తి సినిమా షూటింగ్ కు ముందే ఆపరేషన్ చేయించుకోవాలని భావించి ముంబై ఆస్పత్రిలో చేరారని తెలిపాయి. చిరంజీవి సతీమణి సురేఖ ఆయన వెంట ఉన్నారు. ఆపరేషన్ చేయించుకున్న తర్వాత ఆయన దాదాపు రెండు వారాల పాటు విశ్రాంతి తీసుకునే అవకాశముందని తెలుస్తోంది.

ఆయనను ఎప్పుడు డిశ్చార్జి చేస్తారనేది వెల్లడి కాలేదు. పూర్తిగా కోలుకున్నాకే ఆయన హైదరాబాద్ కు తిరిగొచ్చే  అవకాశముందని సమాచారం. ఇకపోతే కత్తి సినిమాపై ఇప్పటి వరకు వచ్చిన కొన్ని వార్తలు విషయంపై కూడా చిరు డిశ్చార్జి అయి వచ్చిన తర్వాత పూర్తి వివరాలు వెలిబుచ్చుతారని సమాచారం. వాస్తవానికి ఈ   సినిమా షూటింగ్ మార్చిలో ప్రారంభంకానుంది. వివి వినాయక్ దర్శకత్వం వహిస్తారు.


మరింత సమాచారం తెలుసుకోండి: