భాగ్యనగరంలో  మండి పోతున్న ఎండలకు తన గ్లామర్ వేడిని కూడ జతచేసి రకుల్ ప్రీత్ చేసిన హంగామాకు హైదరాబాద్ యూత్ అదిరిపోయారు. ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా రకుల్ ప్రీత్‌ సింగ్ బైక్ మీద రయ్ మంటూ తిరిగేయడంతో యూత్ కళ్లు తిప్పుకోలేక షాక్ లోకి వెళ్ళిపోయారు. 

అయినా షాక్ నుండి తేరుకుని  కొందరు అసలు విషయం గురించి ఆరా తీస్తే అసలు విషయం బయటికొచ్చింది. హైదరాబాద్‌లో ట్రాఫిక్ నిబంధనలపై వాహనదారులకి అవగాహన కల్పించేందుకు గోషామహల్ ట్రాఫిక్‌ పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన  ఈ కార్యాక్రమంలో రకుల్ ఇలా  నలువైపులా బైక్‌పై చక్కర్లు కొట్టింది. 

ఈ సందర్భంగా రకుల్  మీడియా తో మాట్లాడుతూ టూ వీలర్స్ వినియోగదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని విజ్ఞప్తి చేసింది. నగర పోలీసులు ప్రత్యేక చొరవతో చేస్తున్న ఈ కార్యక్రమాల వల్ల రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని అభిప్రాయ పడింది రకుల్.  ఇలా సామాజిక కార్యక్రమాల్లో రకుల్ పార్టిసిపేట్ చేయడం ఇదే మొదటిసారి కాదు.  

గత సంవత్సరం బాలల దినోత్సవం సందర్భంగా  హైదరాబాద్ లో క్యాన్సర్‌ తో బాధ పడుతున్న చిన్నారులతో రకుల్ సందడి చేసింది.  సినిమా హీరోయిన్లు కోట్ల సంపాదనకు  గ్లామర్  ఎక్స్ పోజింగ్ కే కాకుండా  ప్రజల శ్రేయస్సు దృష్ట్యా కూడా పని చేస్తారని రకుల్ ప్రీత్ తన చేతలతో మరోసారి  నిరూపించింది అనుకోవాలి.  ఏమైనా రకుల్ హంగామా మాత్రం మీడియా  కెమెరాలకు హాట్ టాపిక్ గా మారింది.. 



మరింత సమాచారం తెలుసుకోండి: