పారిస్, ఈ ప్రేమనగర్ కు రణవీర్ సింగ్ - వాణి కపూర్ కలసి  నటిస్తున్న "బేఫికర్" సినిమా షూటింగ్ కోసం తమ కొత్తగా పుట్టిన ముద్దుల పాప  అదీరా  తో వచ్చి రాణి ముఖర్జీ , ఆదిత్య చోప్రా లు ముద్దులు పంచుకుంటు, విరామ సమయాల్లో పాపతో ఖుషి చేసుకుంటున్నారు. అదే సమయానికి  రాణి ముఖర్జీ  అభిమానులు  కొంత  మంది   పసిపాప తో ఉన్న రాణి ముఖర్జీని ఆ సినిమా సెట్స్ మీదే  ఫోటోలు తీసుకోవటానికి ప్రయత్నించారు.  అయితే తమను ఇలా ఫోటోలు తీయొద్దు అని ఆమె ఎంత చెప్పినా వారు వినిపించుకోకుండా ఒకరిపై ఒకరు పడుతూ ఫోటోలు తీయడం మొదలు పెట్టారట. ఇక లాభం లేదనుకున్న  ఆమె తన సహాయకుని తో కలసి అతి కష్టం మీద ఆ గుంపును పక్కకు తోయడానికి ప్రయత్నించినా లాభం లేక పోయిందట. 


ఇక రాణి చాలా క్లియర్ గా ‘తన పాప ఫోటొలు తీయవద్దని, వాటిని ఆన్-లైన్ లో పెట్టవద్దని’ చెపుతూ వారిని తప్పించుకోవటానికి ప్రయత్నించారు.   కానీ అభిమానులు ఏమాత్రం వినకుండా ఫోటోలు తీయడంతో  ఆమె ఆగ్రహించి  తన హోటల్  వైపుకు పాపను తీసుకొని పరుగెత్తినట్లు ఆ సెట్లో ఉన్న వారు చెప్పినట్లు తెలిసింది.  ఈ మద్య తెలుగు ఇండస్ట్రీలో కూడా అభిమానుల అతి గురించి అల్లు అర్జున్ సవివరంగా వివరించారు..పవర్ స్టార్ గురించి తాను మాట్లాడకపోయే సరికి అది పెద్ద రాద్దాంతం చేసిన విషయం తెలిసిందే..అయితే దీని గురించి ఒక మనసు ఆడియో వేడుకలో బన్ని మాట్లాడుతూ..హీరోలు అంటే అభిమానం ఉండోచ్చు కానీ అది ఇతరుల మనసు నొప్పించేదిలా ఉండకూడదని అన్నారు.

 

పవన్ స్టార్ గురించి పదే పదే ప్రస్తావన మెగాస్టార్ ముందు తీసుకు రావడం..ఆ సమయంలో చిరంజీవి చిన్నబుచ్చువడం జరుగుతుందని ఇలా చేయడం ఎంత వరకు న్యాయమని అన్నారు. అయితే  అభిమాను అందరూ కాదని కొంత మంది అభిమానులు ఇలాంటి కొంటె పనులు చేస్తున్నారని వారిని నియంత్రించాల్సిన అవసరం చాలా ఉందని బన్ని అన్నారు. మొత్తానికి  అభిమానులు ఈ మధ్య మరీ దురభిమానులు గా మారుతున్నారు. కొన్ని సార్లు వారిది అభిమానమా? పిచ్చా? అర్ధం కాని పరిస్థితి. అయితే 




మరింత సమాచారం తెలుసుకోండి: