అల్లుఅర్జున్ తన విదేశ విహార యాత్రను ముగించుకుని తిరిగి తన ఇంటికి చేరుకున్నా తన తదుపరి సినిమా విషయంలో ఒక నిర్ణయం తీసుకోవడానికి చాల ఆలోచనలు చేయవలసి వస్తోంది అని టాక్. ఈ ఆలోచనల మధ్య బన్నీకి తన తండ్రి అరవింద్ చెప్పిన సలహాలు కూడ పెద్దగా నచ్చడం లేదు అనే వార్తలు వస్తున్నాయి. 

అల్లుఅర్జున్ తన ఫ్యామిలీతో టర్కీకి వెళ్ళే ముందు దర్శకుడు లింగు స్వామి కథకు ఇంచుమించు ఓకె చెప్పి తన విహార యాత్రకు వెళ్ళిపోయాడు. అయితే బన్నీ తండ్రి అరవింద్ కు మాత్రం తన కొడుకు లింగు స్వామి సినిమాలో నటించే కన్నా ఇప్పటికే దర్శకుడు విక్రమ్ కుమార్ చెప్పిన సైన్స్ థ్రిల్లర్ లో నటిస్తే బాగుంటుంది అని చాల గట్టి నమ్మకం పై ఉన్నాడని టాక్. 

అయితే బన్నీ మాత్రం ఒక హీరోను మాస్ హీరోగా చూపించడంలో లింగు స్వామికి మంచి పేరు ఉన్న నేపధ్యంలో కోలీవుడ్ లో తన మార్కెట్ పెరగాలి అంటే విక్రమ్ కుమార్ సినిమా కన్నా లింగు స్వామి సినిమా మంచిది అని గట్టిగా వాదిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వార్తలు ఇలా ఉండగా  ఫిల్మ్‌నగర్ నుంచి అందుతున్న సమాచారం మేరకు తమిళ డైరెక్టర్ లింగు‌స్వామి  బన్నీ ప్రాజెక్ట్ సెట్స్‌ పైకి వెళ్లడం దాదాపు ఖాయమైంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి. 

ఈసినిమాకు లగడపాటి శ్రీధర్ నిర్మాతగా వ్యవహరిస్తూ ఉంటే అల్లు అరవింద్ తన గీత ఆర్ట్స్ తరపున సహ నిర్మాతగా వ్యవహరిస్తాడని టాక్. అయితే ఈ ప్రాజెక్ట్ అరవింద్ కు పెద్దగా ఇష్టం లేదు అని వార్తలు వస్తున్న నేపధ్యంలో మళ్ళీ చివరి నిముషoలో ఎలాంటి మార్పులు జరుగుతాయో చూడాలి..  



మరింత సమాచారం తెలుసుకోండి: