హీరోయిన్స్ గ్లామర్  ఎక్స్ పోజ్ చేయడంలో రాఘవేంద్రరావును  మించిన వారు లేరు. నిన్న మొన్నటి వరకు మౌన మునిలా ఉన్న రాఘవేంద్ర రావు ‘సౌందర్య లహరి’ ధారా వాహికను మొదలు పెట్టాక మాట్లాడటం మొదలు పెట్టాడు. దీనికి కొనసాగింపూగా ఇప్పుడు సినిమా ఫంక్షన్ లో స్టేజి ఎక్కినప్పుడు బాగా మాట్లాడటమే కాకుండా తూటాల లాంటి మాటలను కూడ వదులు తున్నాడు ఈ దర్శకేంద్రుడు. 

ప్రస్తుతం భక్తి సినిమాలు తీస్తున్నఈయన నోటి నుంచి అప్పుడప్పుడు వస్తున్న డబుల్ మీనింగ్ డైలాగులు వింటున్న వారికి ఇంకా రాఘవేంద్రరావు మారలేదేమో అని అనిపించడం సహజం. లేటెస్ట్ గా దర్శకడు యస్.యస్.రాజమౌళి కజిన్ ఎస్.ఎస్. కాంచి దర్శకత్వంలో  రూపొందుతున్న ‘షో టైమ్’ చిత్రం టీజర్ లాంచింగ్ కు ముఖ్య అతిథిగా ఈ దర్శకేంద్రుడు హాజరయ్యాడు. ఆయనతో పాటు రాజమౌళి యమ్.యమ్. కీరవాణితో పాటు ఇతర రాజమౌళి కుటుంబ సభ్యులంతా హాజరయ్యారు.

ఈసందర్భంగా యాంకరింగ్ చేసిన అభి అక్కడకు వచ్చిన అతిధులు అందరినీ మీరు సినిమాకు ఎందుకు వెళతారు? అంటూప్రశ్నలు వేసి  సమాధానాలు రాబట్టడానికి ప్రయత్నించాడు. అయితే రాఘవేంద్రరావును మాత్రం ఆయాంకర్  ప్రశ్నించలేదు. దానితో  రాఘవేంద్రరావు  స్టేజ్ ఎక్కి తనను ఎందుకు ప్రశ్నించలేదు అంటూ ఆ యాంకర్ ను కార్నెర్ చేసాడు.  ఆమాటలకు షాక్ అయిన యాంకర్ అభి ఇప్పుడు అడుగుతున్నా మీరు సినిమా థియేటర్ కు ఎందుకు వెళతారు అని ప్రశ్నించాడు. దీనికి  రాఘవేంద్రరావు సమాధానం ఇస్తూ తానూ సినిమాకు వెళితే హీరోయిన్ ను మాత్రమే చూస్తాను అని చెప్పి షాక్ ఇచ్చాడు. 

ఆ మాటలకు యాంకర్ అభి మరింత రెచ్చిపోయి ‘సార్ మీకు అక్కడ యాపిల్స్ ఏమైనా కనిపిస్తాయా’ అంటూ జోక్ చేసాడు. ఈ మాటలకు  రెచ్చిపోయిన రాఘవేంద్రరావు తనదైన స్టైల్లో ‘ఎవరి యాపిల్స్ వారి వద్ద వుంటాయి. వాటిని నేనేందుకు చూస్తా. నా యాపిల్స్ మాత్రం ఇంట్లో వుంటాయి. వాటినే చూస్తా’ అని సమాధానం ఇవ్వడంతో  భక్తి సినిమాలు తీస్తున్న రాఘవేంద్రరావుకి ఇంకా రక్తి తగ్గలేదు అంటూ ఆ ఫంక్షన్ కు వచ్చిన చాలా మంది కామెంట్ చేసుకున్నట్లు టాక్.. 


మరింత సమాచారం తెలుసుకోండి: