టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు లేటెస్ట్ గా మురగదాస్ దర్శకత్వంలో నటించబోతున్న సినిమా కోసం 30 కోట్ల పారితోషిక ఆఫర్ ను వదులు కోవడం ఇప్పుడు ఫిలింనగర్ లో హాట్ టాపిక్ గా మారింది. ‘బ్రహ్మోత్సవం’ ఫెయిల్యూర్ అయినా మహేష్ క్రేజ్ ఏమాత్రం తగ్గక పోవడంతో మహేష్ కు భారీ ఆఫర్స్ వచ్చి పడుతూనే ఉన్నాయి.

ఈ నేపద్యంలో కోలీవుడ్ టాప్ డైరెక్టర్ సుందర్ సి. తెలుగు తమిళ భాషలలో 350 కోట్ల భారీ బడ్జెట్ తో తీయబోతున్న ఫ్యాంటసీ మూవీ ‘సంఘమిత్ర’ లో నటించమని మహేష్ పై తీవ్ర ఒత్తిడి చేయడమే కాకుండా మహేష్ ఇప్పటి వరకు తన కెరియర్ లో అందుకొని 30 కోట్ల భారీ పారితోషికాన్ని ఆఫర్ చేసినా మురగ దాస్ సినిమా కోసం ఈ  ఆఫర్ ను తిరస్కరించినట్లు టాక్. అయితే దర్శకుడు సుందర్ మురగదాస్ సినిమాను చేస్తూ కూడ ఆ సినిమా లుక్ తోనే తన సినిమాలో కూడ నటించే విధంగా ఏర్పాట్లు చేస్తానని సుందర్ ఎంత ఒత్తిడి చేసినా మహేష్ మనసు మారలేదు అన్న మాటలు వినిపిస్తున్నాయి.

‘బ్రహ్మోత్సవం’ ఫెయిల్యూర్ తో తీవ్ర నిరాశకు గురి కాబడ్డ మహేష్ కేవలం భారీ పారితోషికాల కోసం ఒకేసారి రెండు సినిమాలు చేస్తూ తాను అయోమయంలో పడి దర్శకులను అయోమయంలో పడేయడం ఇష్టంలేక మహేష్ ఈ నిర్ణయం తీసుకున్నాడు అని అంటున్నారు. సుప్రసిద్ధ సంగీత దర్శకుడు ఎ.ఆర్. రెహమాన్ ‘బాహుబలి’ కి పనిచేసిన ఆర్ట్ డైరెక్టర్ సబు శిరిల్ గ్రాఫిక్స్ ఎక్స్ పర్ట్ కమల కన్నన్ లు పనిచేస్తున్న ఈ భారీ మూవీని మురగదాస్ సినిమా కోసం వదులు కోవడం ద్వారా మహేష్ పెద్ద త్యాగమే చేసాడు అని అంటున్నారు. 

తన విదేశీ పర్యటన ముగించుకుని ఇండియాకు తిరిగి వచ్చినా మహేష్ గత వారం జరిగిన ‘సైమా’ అవార్డ్స్ ఫంక్షన్ లో ఉత్తమ నటుడు అవార్డ్ అందుకోవడానికి ఆ ఫంక్షన్ నిర్వాహకులు ఎంత వత్తిడి చేసినా సింగపూర్ వెళ్ళకుండా ఉండి పోయిన విషయం తెలిసిందే.  దీనితో మహేష్ ఇలా తన వద్దకు వస్తున్న కోట్ల పారితోషికాలను అదేవిధంగా తనకు ఇస్తున్న అవార్డులను పట్టించు కోకుండా ఉండటం వెనుక కారణం మహేష్ కు ‘బ్రహ్మోత్సవం’ ఇచ్చిన షాక్ అనుకోవాలా ? లేదంటే మురగదాస్ సినిమా పై పెరిగి పోయిన ఏకాగ్రత అనుకోవాలా అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: