తెలుగు ఇండస్ట్రీలో హ్యాపీడేస్ చిత్రంతో ఒక్కసారిగా అందరి దృష్టి ఆకర్షించిన డైరెక్టర్ శేఖర్ కమ్ముల. తర్వాత వచ్చిన చిత్రాలు కూడా చాలా కూల్ గా ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యేలా ఉండటంతో ఈ డైరెక్టర్ మంచి అభిప్రాయం ఏర్పడింది. ఎలాంటి వల్గారిటీకి తావు ఇవ్వకుండా అద్భుతమైన దర్శకత్వం వహిస్తాడన్న పేరు శేఖర్ కమ్ముల సంపాదించాడు. అయితే గత కొంత కాలంగా ఆయన తీసిన సినిమాలు పెద్దగా విజయం సాధించలేదు..తాజాగా మెగా హీరో వరుణ్ తేజ్ ఓ చిత్రం దర్శకత్వం వహిస్తున్నారు.   శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై రూపొందనున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు.

అయితే మెగా అబ్బాయి సరసన మళియాల భామ సాయి పల్లవి నటించనుంది. అయితే ఈ చిత్రానికి సంబంధించి స్క్రిప్ట్ గురించి శేఖర్ కమ్ముల, వరుణ్ తేజ్, సాయిపల్లవి చర్చించుకుంటున్న సందర్భంగా ఓ ఫోలో తీయడం..అది కాస్త సోషల్ మీడియాలో వరుణ్ తేజ పోస్ట్ చేయడంతో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

ఇక చిత్ర కథ విషయానికి వస్తే.. ఓ అమెరికా అబ్బాయి..తెలంగాణ అమ్మాయిని ప్రేమిస్తాడు..అప్పుడు అతనికి ఎదురైన సమస్యలు ఏంటీ వాటిని ఆ హీరో ఎలా చేదిస్తాడు అన్న దానిపై ఫ్యామిలీ ఎంట్ర టైన్ మెంట్ గా రూపొంద బోతుందట. జులై 25నుంచి ఈ చిత్రాన్ని సెట్స్‌పైకి వెళ్లేలా చిత్రయూనిట్ ప్లాన్ చేస్తున్నారు. డిసెంబర్‌లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: