ఐదేళ్ళ క్రితం విడుదలైన ‘అలామోదలైంది’ సినిమా తరువాత నిత్యామీనన్ ఎవరో అందరికీ తెలిసి పోయింది.  ఆ సినిమా ఘన విజయం సాధించడంతో నిత్యామీనన్ కు ఆరోజులలో చాల అవకాశాలు క్యూ కట్టాయి.  అప్పట్లోనే హీరో వెంకటేష్ నటిస్తున్న ఒక సినిమాకు నిత్యామీనన్ ను హీరోయిన్ గా ఎంపిక చేయాలని ఆ సినిమా దర్శక నిర్మాతలు చాల గట్టిగా ప్రయత్నాలు చేసారు.

అయితే నిత్యామీనన్ మాత్రం తనకు వెంకటేష్ కు మధ్య ఏజ్ గ్యాప్ చాల ఎక్కువని అందువల్ల సిల్వర్ స్క్రీన్ పై వారిద్దరూ రొమాన్స్ చేసినా ప్రేక్షకులు అంగీకరించరు అంటూ సున్నితంగా ఆఫర్ ను తిరస్కరించింది నిత్య.  ఆ తరువాత ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నిత్యామీనన్ మాట్లాడుతూ తనకు ప్రభాస్ ఎవరో తెలియదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.  

దీనితో నిత్యామీనన్ నోటి దూకుడు తట్టుకోలేక టాప్ హీరోలు అంతా నిత్యామీనన్ ను పక్కన పెట్టేసారు.  ఆ తరువాత చిన్న సినిమాలకు చిన్న హీరోల సినిమాలకు హీరోయిన్ గా మారిన నిత్యామీనన్ ఆ చిన్న సినిమాలు చేస్తూనే కాలం గడుపుతూ వచ్చింది. 

అయితే గత సంవత్సరం మణి రత్నం ‘ఓకే బంగారం’ ‘అల్లుఅర్జున్ సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాలు ఘన విజయం సాధించడంతో నిత్యామీనన్ హవా మళ్ళీ టాలీవుడ్ లో ప్రారంభం అయింది.  దీనికితోడు ఈ మధ్యనే లేటెస్ట్ గా రిలీజ్ అయిన ‘జనతా గ్యారేజ్’ సూపర్ హిట్ అవడంతో ఇప్పుడు మళ్ళీ అందరి టాప్ హీరోల దృష్టి ఈమె పై పడింది.

దీనితో మారిపోయిన పరిస్తుతులను దృష్టిలో పెట్టుకుని నిత్యామీనన్ కూడ పూర్తిగా మారిపోయి వచ్చిన అవకాశాలు అన్నీ చాల జాగ్రత్తగా కొట్టేస్తోంది.  ఫిలింనగర్ లో వినపడుతున్న లేటెస్ట్ వార్తల ప్రకారం ‘నేను శైలజా’ ఫేం దర్శకుడు కిషోర్ తిరుమల దర్శకత్వంలో త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న ‘ఆడాళ్ళు మీకు జోహార్లు’  అనే టైటిల్ తో నిర్మించ బోతున్న సినిమాకు నిత్యామీనన్ దర్శకురాలిగా ఎంపిక అయింది అని వార్తలు వస్తున్నాయి.  

వయస్సులో వ్యత్యాసం గల ఇద్దరు మనసులు కలిసి ప్రేమలో పడితే అనే కథతో రూపొందబోతున్న ఈసినిమాకు నిత్యామీనన్ హీరోయిన్ గా లైన్ క్లియర్ చేయడంతో తిరిగి ఎప్పుడో ఆగిపోయిన వెంకీ నిత్యామీనన్ ల కాంబినేషన్ తిరిగి తెర పైకి వచ్చింది.  ఇప్పుడు హీరోలందరికీ హీరోయిన్స్ సమస్య ఏర్పడిన నేపధ్యంలో నటించే సామార్ధ్యం ఉన్న నిత్యామీనన్ కు మంచి గోల్డెన్ పీరియడ్ మొదలైంది అని అంటున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: