తెలుగు ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన హీరో మహేష్ బాబు. ఒక్కడు, అతడు, పోకిరి చిత్రాలతో స్టార్ డమ్ తెచ్చుకున్న మహేష్ ఇండస్ట్రీలో అందగాడిగా పేరు తెచ్చుకున్నాడు. తెలుగు ఇండస్ట్రీలో బాహుబలి తర్వాత ఆ రేంజ్ లో శ్రీమంతుడు చిత్రంతో కలెక్షన్లు కొల్లగొట్టి తన స్టార్ ఇమేజ్ మరింత పెంచుకున్నాడు. ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో నటిస్తున్న మహేష్ పై ప్రముఖ దర్శకులు సంచలన వ్యాఖ్యలు చేశారు.
మహేష్ బాబు నిన్ను సూపర్ స్టార్ ని చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రజలు అలాంటిది వాళ్ళ కోసం , భావి తరాల కోసం చేస్తున్న ప్రత్యేక హోదా పోరాటానికి మద్దతు తెలపకుండా పక్కన ఉన్న తమిళనాడు ప్రజలు చేసిన జల్లికట్టు ఉద్యమానికి మాత్రం ఎలా మద్దతు ఇస్తావు అంటూ మహేష్ పై నిప్పులు చెరిగాడు దర్శకులు రాంగోపాల్ వర్మ.
రిపబ్లిక్ డే సందర్భంగా ఏపీ ప్రజలు పెద్ద ఎత్తున ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న వారికి కనీస మద్దతు పలకలేదు. జల్లికట్టు పై స్పందించిన మహేష్ ప్రత్యేక హోదా పై మాత్రం ఎందుకు స్పందించడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు వర్మ.
రాంగోపాల్ వర్మ ట్విట్ :