తెలుగు బుల్లితెరపై ఇప్పుడు టాప్ పొజీషన్లో నడుస్తున్న ప్రొగ్రామ్ ‘జబర్ధస్త్’కామెడీ షో. నాలుగు సంవత్సరాల క్రితం బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చిన ‘జబర్ధస్త్’కామెడీ షో ఎంతో మంతి ఔత్సాహిక కళాకారులకు మంచి ఫ్లాట్ ఫామ్ అయ్యింది. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో జబర్ధస్త్ కామెడీ టీమ్ మంచి కమెడియన్లుగా చెలామణి అవుతున్నారు. ఈ ప్రోగ్రామ్ ఎంత ఆదరణ పొందుతుంతో..అంతే విమర్శలకు గురి అవుతుంది. గతంలో ఈ ప్రోగ్రామ్ లో అసభ్యకరమైన స్కిట్ లు చేసి జనాల చేత తన్నులు తిన్న సంఘటనలు కూడా ఉన్నాయి. అంతే కాదు ఈ ప్రోగ్రామ్ లో చేస్తున్న చమ్మక్ చంద్రపై బి గ్రేడ్ నటీమణి స్వాతినాయుడు నిందలు వేసింది.
ఈ విషయం సోషల్ మీడియాలో పెద్ద రచ్చ రచ్చే అయ్యింది. తర్వాత కొంత మంది పెద్దలు కల్పించుకొని సర్ధుమణిగేలా చేశారు. తర్వాత ఓ స్కిట్ పై కోర్టు లో కేసు కూడా నమోదైంది. ఇలా ఎన్నో విమర్శలు వస్తున్నా ‘జబర్ధస్త్’కామెడీ షో మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. తాజాగా ఇంటర్వ్యూలో నాగబాబు మాట్లాడుతూ.. జబర్దస్త్ లో వస్తున్న అసభ్య కామెడీపై స్పందిచారు. కామెడీలో వందకు పైగా రకాలున్నాయని అందులో డబుల్ మీనింగ్, స్పైసీ కామెడీలు కూడా ఒక భాగమన్నారు. జబర్దస్త్లో డబుల్ మీనింగ్ స్కిట్లతో పాటుగా నీట్గా ఉండే స్కిట్లు కూడా ఉన్నాయని అన్నారు.
కొన్ని సందర్భాల్లో వాళ్ల డైలాగ్స్ లో డబుల్ మీనింగ్ వస్తే నేను హెచ్చరిస్తూనే ఉంటానని వెంటనే వారు సరిచేసుకుంటారని అన్నారు. నాలుగేళ్లుగా జరుగుతున్న ఈ ప్రోగ్రామ్లో ఒకటీ అర వస్తుంటాయని అన్నారు. రోజు రోజుకు జబర్దస్త్కు ఆదరణ పెరుగుతుందని, గురు శుక్ర వారాలు వచ్చాయంటే సినిమాలకు కూడా వెళ్లకుండా ప్రజలు చూస్తున్నారని అన్నారు. నిజానికి మొదట్లో ఈ ప్రోగ్రామ్ను పది ఎపిసోడ్లు మాత్రమే చెద్దామనుకున్నారని, అయితే చాలా విజయవంతమైందని తెలిపారు. ఇది ఒక అద్భుతం అని, ఇలాంటి దానిలో భాగం అవ్వడం తమ అదృష్టమని చెప్పారు నాగబాబు.