‘ఖైదీ నెంబర్ 150’ రికార్డులు క్రియేట్ చేయడంతో మంచి జోష్ మీద ఉన్న చిరంజీవి ఈ క్రేజ్ ను ఏమాత్రం వృథా కానివ్వకుండా తన 151వ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. సురేంద్ర రెడ్డి ఈమూవీకి దర్శకత్వం వహిస్తున్న విషయాన్ని చిరంజీవి స్వయంగా ప్రకటించాడు. 

అయితే ఈ మూవీ స్టోరీ ‘ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి’ అని ప్రచారంలో ఉన్నా ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా మెగా కాంపౌండ్ ప్రకటించలేదు. కానీ ఈ మూవీ ప్రమోషన్ ను ఒక ప్రముఖ ఛానల్ మొదలు పెట్టి ఈసినిమాకు సంబంధించిన ఇంటర్వ్యూలు ప్రసారం చేస్తూ ఉండటం చాలామందిని ఆశ్చర్య పరుస్తోంది. 

దీనితో ఇంకా షూటింగ్ కూడ ప్రార్రంభం కాని చిరంజీవి 151వ సినిమాకు అప్పుడే పబ్లిసిటీ ఏమిటి అంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు. వాస్తవానికి ఈ స్క్రిప్ట్ పరుచూరి బ్రదర్స్ దగ్గర ఎప్పటి నుంచో ఉంది అన్న వార్తలు ఉన్నాయి. అయితే ఈ స్క్రిప్ట్ ను ఇప్పటి జనరేషన్ కు అనుగుణంగా మారుస్తున్నారా? లేదంటే పాతకాలపు సినిమాగా తీయబోతున్నారా? అన్న విషయం పై రకరకాల కథనాలు ఉన్నాయి. 

ఈ వార్తల పై క్లారిటీ రాకుండానే ఒక ప్రముఖ ఛానల్ ఉన్నట్లుండి ఈమూవీ పై ఒక కథనాన్ని ప్రసారం చేసింది. ఈ ఛానల్ ఈ కథనం ప్రసారం చేయడానికి ఏకంగా హీరో శ్రీకాంత్ ను రంగంలోకి దింపింది. ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ జీవితం గురించి ప్రత్యేకంగా కథనం ప్రసారం చేయడం కోసం ఏకంగా హీరో శ్రీకాంత్ ను బనగానపల్లె, కోయిలకుంట్ల ప్రాంతాలకు తీసుకెళ్లి అతడి చేత ఆ సినిమా కథను చెప్పించడం చాలామందిని ఆశ్చర్య పరిచింది.

శ్రీకాంత్ కు మెగా కాంపౌండ్ కు ఉన్న సాన్నిహిత్యం రీత్యా శ్రీకాంత్ చిరంజీవి 151వ సినిమా గురించి చెప్పడం పెద్దగా ఆశ్చర్యం అనిపించకపోయినా అసలు పూజా కార్యక్రమాలు కూడ జరగని ఈ మూవీ ప్రమోషన్ ను అప్పుడే ఎందుకు మొదలు పెట్టారు అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు ఈసినిమా కథ గురించి అందరికీ తెలియాలని మెగా కాంపౌండ్ ఇలా తన ప్రయత్నాలు అప్పుడే మొదలు పెట్టిందా ? లేదంటే ప్రారంభం కాని ఈసినిమాకు అప్పుడే బిజినెస్ కోసం ఈ ఎత్తుగడా ? అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి..   


మరింత సమాచారం తెలుసుకోండి: