తెలుగు ఇండస్ట్రీలో మెగస్టార్ చిరంజీవి వేసిన బాటలో ఇప్పటికే అరడజను మంది హీరోలు వచ్చారు. అయితే ఏ హీరో మరో హీరోకి పోటీ కాకుండా తమ సొంత టాలెంట్ తో అభిమానుల మనసు దోచుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇండస్ట్రీలో మెగాస్టార్ తర్వాత అంత గొప్ప ఫాలోయింగ్ మాత్రం ఆయన సోదరుడు పవర్ స్టార్ పవన్ కళ్యాన్ సంపాదించాడు. కేవలం నటన పరంగానే కాకుండా రాజకీయంగా కూడా పవన్ కళ్యాన్ ప్రజలతో మమేకమవుతూ తెలుగు రాష్ట్రాల ప్రజల అభిమానం సంపాదించాడు.
ఇక మెగాస్టార్ అల్లుడు..స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తనయుడు అల్లు అర్జున్ డ్యాన్స్, ఫైట్స్ తో చాలా స్టైలిష్ గా అభిమానులకు చేరువయ్యాడు. ఆయన తమ్ముడు అల్లు శిరీష్ కూడా మూడు సినిమాల్లో నటించి నాట్ బ్యాడ్ అనిపించుకున్నాడు. మెగాస్టార్ తనయుడు రాంచరణ్ విషయానికి వస్తే..తీసినవి కొన్ని సినిమాలే అయిన అద్భుతమైన విజయాలు సాధించిన చిత్రాలు కావడం విశేషం. గత సంవత్సరం రిలీజ్ అయిన ధృవ చిత్రంతో కొత్త రికార్డు సృష్టించాడు చెర్రీ. ఇక చిరంజీవి మేనళ్లుడు సాయిధరమ్ తేజ్ వచ్చే రావడంతోనే బంపర్ హిట్ కొట్టాడు..తర్వాత వరుస విజయాలు సాధిస్తూ ఇండస్ట్రీలో సుప్రీమ్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు.
ఇక మెగాబ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ తొలి చిత్రం ముకుంద తో మంచి విజయం అందుకున్నాడు..తర్వాత వచ్చిన కంచె చిత్రంతో మంచి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తర్వాత వచ్చిన లోఫర్ తో కాస్త ఢీలా పడ్డాడు. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఇక సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ విషయానికి వస్తే..మనోడు వరుసగా హిట్ సినిమాలు రావడంతో దూకుడు పెంచాడు. పిల్లా నువ్వులేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్, సుప్రీమ్ లాంటి ఘన విజయాలు సాధించిన తర్వాతా ఇండస్ట్రీలో మినిమం గ్యారెంటీ హీరో అనుకున్నారు దర్శక నిర్మాతలు.
దీంతో మనోడి చుట్టు ప్రదక్షణలు చేయడం మొదలు పెట్టారు. దీంతో బలమైన కథ ఎంచుకునే విషయంలో తనకు టైమ్ లేకనో త్వరగా సినిమాలు తీయాలనే హడావిడితోనే మొత్తానికి రీసెంట్ గా రిలీజ్ అయిన ‘విన్నర్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్ల పడింది. దీంతో సాయిధరమ్ తేజ్ కన్ఫ్యూజన్ లో పడ్డారని తన రాబోయే చిత్రాల విషయంలో కాస్త శ్రద్ద తీసుకోవాల్సిన అవసరం ఉందని సినీ పెద్దలు అంటున్నారు.