ఈ మద్య కాలంలో బుల్లితెర నటుల మరణాలు ప్రేక్షకుల మనసులు కలచివేస్తున్నాయి.  ఇప్పటికే తెలుగు టీవి నటుడు సప్తమాత్రిక హీరో ప్రదీప్ ఆత్మహత్య చేసుకున్న ఘటన మరువక ముందే మరో కన్నడ టీవి నటి రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది.  ప్రముఖ కన్నడ టీవి నటి రేఖ సిందు (22) ప్రయాణిస్తున్న భారీ ప్రమాదానికి గురి కావడంతో రేఖ తో పాటు అందులో ప్రయాణిస్తున్న మరో ముగ్గురు కూడా స్పాట్ లోనే చనిపోయారు.  

ఈ ప్రమాదం బెంగుళూర్ నుండి చెన్నై కి షూటింగ్ నిమిత్తం వెళుతున్న సమయంలో తమిళనాడు లోని వెల్లూరు జిల్లా సున్నం పకొట్టాయ్ గ్రామ శివారులో జరిగింది. గత కొంత కాలంగా తమిళ, కన్నడ టివి షోలో రేఖ మంచి పాపురారిటీ సంపాదించింది.

బుల్లితెరపైనే కాకుండ వెండి తెరపై కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలన్న ప్రయత్నంలో ఉన్న రేఖ సింధు అకస్మాత్తుగా చనిపోవడం బుల్లి తెర అభిమానుల మనసు కలచి వేసింది.   అయితే అకస్మాత్తుగా రేఖ భారీ ప్రమాదంలో చనిపోవడంతో తమిళ టివి పరిశ్రమ తో పాటు కన్నడ బుల్లితెర వాసులు కూడా షాక్ కి గురయ్యారు . 


మరింత సమాచారం తెలుసుకోండి: