తమిళనాడు రాష్ట్రంలో గత కొంత కాలంగా రాజకీయాల్లో, సినీరంగంలో గందర గోళం చెలరేగుతుంది.  మొన్నటి వరకు సీఎం పీఠం కోసం జరిగిన యుద్దం ఓ వైపు..తమిళ సినీ ఇండస్ట్రీలో సుచీ లీక్స్ మరోవైపు ప్రతిరోజు హాట్ టాపిక్ గా నిలిచాయి.  తాజాగా ఇప్పుడు మరో షాకింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.   తమిళ స్టార్ హీరో సూర్య కు షాక్ ఇచ్చారు జర్నలిస్ట్ లు .తమిళ చిత్ర పరిశ్రమకు సంబంధించిన ఎనిమిది మంది నటీనటులకు ఒకేసారి కోర్టు నోటీసులు జారీ కావడం ఆసక్తికరంగా ఉంది.
kattappa
వీరులో ఏడు మందిపై నాన్ బెయిలబుల్ వారెంట్లు, ఒకరిపై పీటీ వారెంట్ జారీ అయ్యింది. వీరిలో ప్రముఖ నటీనటులు ఉండటం గమనార్హం. తమిళ స్టార్ హీరో సూర్య, సీనియర్ నటులు శరత్ కుమార్, సత్యరాజ్, వివేక్, విజయ్ కుమార్, దర్శకురాలు శ్రీప్రియ, నటుడు అరుణ్ విజయ్, దర్శకుడు చేరణ్ లపై వారెంట్లు జారీ అయ్యాయి.   ఒక్క సూర్య మాత్రమే కాకుండా తమిళ సినీ పరిశ్రమకు చెందిన పలువురు నటీనటులకు షాక్ ఇచ్చారు . తమ పట్ల పలువురు నటీనటులు అనుచిత వ్యాఖ్యలు చేసారంటూ నీలగిరి కోర్టు ని ఆశ్రయించారు జర్నలిస్ట్ లు .
విరుచుకుపడిన నటీ నటులు
జర్నలిస్ట్ ల వినతిని పరిశీలించిన కోర్టు ఏకంగా ఆరుగురు నటీనటులకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయగా హీరో సూర్య కు మాత్రం పీటీ వారెంట్ జారీ చేసింది నీలగిరి కోర్టు .  ఇది 2009 నాటి వ్యవహారం అని తెలుస్తోంది. నడిగర్ సంఘం సమావేశం లో మాట్లాడుతూ ఈ నటీనటులంతా జర్నలిస్టులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి అవమానించినట్టుగా తెలుస్తోంది. దీనిపై పాత్రికేయులు కోర్టుకు ఎక్కారు. విచారణ కొనసాగుతోంది. ఈ నటీనటులెవ్వరూ కోర్టుకు హాజరు కావడం లేదు. ఈ క్రమంలో మంగళవారం కేసును విచారించిన కోర్టు వారెంట్లు జారీ చేసింది.

Image result for సూర్య

  

మరింత సమాచారం తెలుసుకోండి: