తెలుగు ఇండస్ట్రీ లో ఎంతో మంది యువ దర్శకులకు ఆదర్శంగా నిలిచిన దర్శకరత్న దాసరి నారాయణ రావు నిన్న రాత్రి కీమ్స్ ఆసుపత్రిలో మరణించిన విషయం తెలిసిందే.  తెలుగు ఇండస్ట్రీలో స్వయంకృషితో పైకి వచ్చిన ఆయన ఎంతో మంది నటీనటులకు అద్భుతమైన అవకాశాలు కల్పించి వారిని స్టార్ హోదాలో నిల్చోబెట్టారు.  ఎన్టీఆర్, ఏఎన్ఆర్,శోభన్ బాబు లాంటి అగ్ర హీరోలకు అద్భుతమైన సినిమాలు అందించి ఆల్ టైమ్ రికార్డులు స్థాపించారు.


 చిన్న తనంలో ఎన్నో కష్టాలు పడ్డ దాసరి యువకులుగా ఉన్న సమయంలో నాటకాలు, రచనలు చేస్తూ మద్రాస్ కి వచ్చి తాాతామనవడు చిత్రంతో సూపర్ డూపర్ హిట్ అందుకున్నారు.  ఆ తర్వాత ఆయన మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. దాసరి వద్ద శిశ్యరికం చేసిన వారు ఎంతో మంది స్టార్ దర్శకులు అయ్యారు.  ఆయన మరణం తెలుగు ఇండస్ట్రీకి తీరని లోటు అని కన్నీలి సాగరంలో మునగిపోయారు. 


మోహన్ బాబు : తెలుగు ఇండస్ట్రీ ఓ గొప్ప దర్శకుడిని, నాయకుడిని కోల్పోయిందని అన్నారు.  నాకు ఇద్దరే ఇద్దరు పూజ్యనీయులు..ఒకటి అన్న ఎన్టీఆర్, దాసరి నారాయణ రావు.  ఇండస్ట్రీలో ఎన్నో కష్టాల్లో ఉన్న సమయంలో నా భుజం తట్టి ధైర్యం చెప్పి ముందుకు నడిపించిన వారు దాసరి నారాయణ రావు.  అన్నగారు తన సినిమాల్లో చాన్సులు ఇప్పిస్తే..దాసరి తనకు అద్భుతమైన సినిమాలు అందించారని చెప్పారు.  నాకు ఏం మాట్లాడాలో తెలియడం లేదని..నేను దుఖఃసాగరంలో మునిగిపోయానని కన్నీటి పర్యంతం అయ్యారు.


చిరంజీవి : దర్శకరత్న దాసరిగారి అకాల మరణ వార్తను  నేను జీర్ణించుకోలేకపోతున్నాను. ఇటీవలే ఆయన ఆనారోగ్యం కారణంగా అల్లు  రామలింగయ్య గారి అవార్డును స్వయంగా ఆయన ఇంటికి వెళ్ళి నా చేతు మీదుగా అందజేశాను. ఆ సమయంలో ఆయనతో చాలా సేపు మాట్లాడటం జరిగింది. చాలా ఆరోగ్యంగా  నాతో మాట్లాడారు. ప్రస్తుతం నేను చైనాలో ఉన్నాను ఇంతలో ఇలాంటి చేదు వార్తను వినాల్సి వచ్చింది. ఆయన మరణం యావత్తు చిత్ర పరిశ్రమకు తీరనిలోటు.  దర్శక నిర్మాతగా  సినీ పరిశ్రమకు ఆయన అందించిన సేవ‌లు  అనీర్వచనీయం. ఇప్పటివరకూ తెలుగు  సినిమాకు పెద్ద దిక్కులా ఉన్న ఆయన ఇప్పుడు మన మధ్య లేకపోవడం భాదాకరం. బౌతికంగా ఆయన మన మధ్యన లేకపోయినా ఆయన సేవల‌ను ఎప్పుడూ స్మరించుకుంటూనే ఉంటాం.

చిత్రపరిశ్రమకు తీరని లోటు : రామ్‌చరణ్‌
తెలుగు చిత్ర పరిశ్రమకు పెద్ద దిక్కు దర్శకరత్న డా॥ దాసరి నారాయణరావు గారి మరణం యావత్త్  తెలుగు  చిత్ర పరిశ్రమకు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి కల‌గాల‌ని కోరుకుంటున్నాను..రామ్ చ‌ర‌ణ్

పెద్ద దిక్కును కోల్పోయాం:  శివాజీ రాజా, న‌రేష్‌
అనారోగ్యం కార‌ణంగా ఆసుప‌త్రిలో ట్రీట్ మెంట్ తీసుకుని చాలా త్వ‌ర‌గా కోల్కుని మ‌ళ్లీ ఇంటికొచ్చారు. ఇటీవ‌లే  ఫ్యాన్స్ స‌మ‌క్షంలో ఘనంగా పుట్టిన రోజు వేడుక‌లు జ‌రుపుకున్నారు. ఇంత‌లోనే దాస‌రి గారి గురించి  పెను విషాదం లాంటి వార్త‌ను వినాల్సి వ‌చ్చింది. ఆయ‌న మ‌ర‌ణం తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు తీర‌ని లోటు. మా టీమ్ అంద‌రికీ పెద్ద దిక్కులా ఉండే వ్య‌క్తిని మేము కోల్పోయాం. తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు ఎన్నో సేవ‌లందించిన వ్య‌క్తి. ద‌ర్శ‌క దిగ్గ‌జం లేర‌న్న వార్త‌ను జీర్ణించుకోలేక‌పోతున్నాం.. `మా` అధ్య‌క్షులు శివాజీ రాజా, జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ న‌రేష్‌

మరింత సమాచారం తెలుసుకోండి: