మెగా స్టర్ చిరంజీవి  లేటెస్ట్ గా నటిస్తున్న ’ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ సినిమాలో ఆ సినిమా కధ రీత్యా ముగ్గురు హీరోయిన్స్ ఉన్న నేపధ్యంలో చిరంజీవి రామ్ చరణ్ లు అనేక ఆలోచనలు చేసి చిట్టచివరకు హీరోయిన్స్ గా ఐశ్వర్యా రాయ్ – అనుష్క - నయన తారలను ఎంపిక చేయడానికి ఒక స్థిర నిర్ణయానికి వచ్చిన వార్తలు ఇప్పటికే వచ్చాయి. అయితే ఈ ఎంపిక జరిగిన కొద్ది రోజులకే ఐశ్వర్యా రాయ్ పెడుతున్న డిమాండ్స్ మెగా కాంపౌండ్ కు కలవర పెడుతున్నట్లు టాక్.

‘ఉయ్యాలవాడ’ మూవీ బడ్జెట్ దాదాపు 200 కోట్లకు చేరిపోవడంతో ఈ సినిమాను తెలుగు తమిళ హిందీ భాషలలో విడుదలచేసి ఈ సినిమా మార్కెట్ ను పెంచుకోవాలి అన్న ఆలోచనలో మెగా కాంపౌండ్ ఉంది. దీనితో ఈ సినిమా నిర్మిoప బడే అన్ని భాషలలోను ప్రేక్షకులకు పరిచియం ఉన్న హీరోయిన్స్ ఉండాలి అన్న ఉద్దేశంతో ఐశ్వర్యా రాయ్ అనుష్క నయనతారల ఎంపిక జరిగింది అని అంటున్నారు.

అయితే ఈ సినిమాకు సంబంధించి ఐశ్వర్యా రాయ్ రామ్ చరణ్ కు కు  చెపుతున్నకండిషన్లు చుక్కలు చూపెడుతున్నాయి అని వార్తలు వస్తున్నాయి. ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం  బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య ఈ సినిమాకు ఈ సంబంధించిన కథా చర్చలు ముగిసిన తరువాత పారితోషికంగా 9 కోట్లు అడిగింది అని ప్రచారం జరుగుతోంది. 

దీనితో ఇంత భారీ పారితోషికం ఇచ్చి ఈమెను ‘ఉయ్యాలవాడ’ కోసం భరించాలా ? లేదంటే మరో హీరోయిన్ గురించి ఆలోచించాలా అన్న ఆలోచనలలో మెగా కాంపౌండ్ తల మొలకలై ఉన్నట్లు టాక్.  దీనికితోడు అనుష్క నయనతారల డిమాండ్స్ కూడ భారీ స్థాయిలో ఉన్న నేపధ్యంలో ఈసినిమాకు హీరోయిన్స్ విషయంలోనే దాదాపు 15 కోట్లు ఖర్చు అవుతుంది అన్న ప్రచారం జరుగుతోంది. 

ఇది ఇలా ఉండగా చిరంజీవి ఒక స్పెషల్ టీమ్ ను కర్నూల్ జిల్లాలోని ‘ఉయ్యాలవాడ’ నివసించిన గ్రామానికి పంపి ఆగ్రామంలోని పెద్ద వయస్సుతో ఉండే కొంతమంది గ్రామస్తుల దగ్గర నుండి ‘ఉయ్యాలవాడ’ కు సంబంధించిన ఆసక్తికర వివరాలను చేపట్టే పనిలో బిజీగా ఉన్నట్లు టాక్. తెలుగులో ‘బాహుబలి 2’ కలక్షన్స్ ను బ్రేక్ చేయాలి అన్న ఉద్దేశ్యంతో తీస్తున్న ‘ఉయ్యాలవాడ’ సినిమా కోసం చిరంజీవి చాల పెద్ద కసరత్తులు ఇప్పటికే ప్రారంభించాడు..


మరింత సమాచారం తెలుసుకోండి: