ఏది ఐనా  అతి గా చూస్తే వెగటు పుడుతుంది తన అర్ధ నగ్న ఫోటో లతో పాపులారిటీ సంపాదించిన పూనమ్ పాండే త్వరలోతానునటిస్తున్న  బాలీవుడ్ మూవీ ‘నషా' చిత్రం ద్వారా  తొలి ప్రయత్నంలోనే సంచలనం క్రియేట్ చేయాలనే అతి ఉత్సాహంతో  ఈ చిత్రంలో బరితెగింపుగా, విచ్చలవిడిగా తన సెక్సీ అందాలను ఆరబోసింది పూనమ్. కానీ పూనమ్ బరితెగింపు తట్టుకో లేక   దేశ వ్యాప్తంగా కొన్ని చోట్ల నిరసనలు విజ్రుంభిస్తున్నాయి.

ఆమె అర్ధనగ్న పోస్టర్లను నిరసన కారులు ముంబైలో తగులబెట్టారు. అదే విధంగా ఢిల్లీలోనూ ఆమె పోస్టర్లను చింపేసి తగల పెడుతున్నారు .  ఈసందర్భంగా ఆందోళన కారులు మాట్లాడుతూ పూనమ్ పాండే నగ్న పోస్టర్లు అసభ్యకరంగా, అభ్యంతరకరంగా ఉన్నాయని, ముఖ్యంగా పవిత్రమైన రంజాన్ మాసంలో ఇలాంటి సినిమాలను అనుమతించబోమని తెలిపారు. ఈఆందోళన కార్యక్రమాలపై పూనమ్ పాండే షాక్ తిన్నది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే పూనమ్ బాలీవుడ్ ఎంట్రీ, వివాదాస్పదంగా మారింది. ప్రజలలో వచ్చిన ఇలాంటి చైతన్యం నిలబడితే భవిష్యత్తులో బూతు సినిమాలు తీయడానికి అలాగే అటువంటి సినిమాలలో నటించడానికి నటీనటులంతా వెనుకంజ వేస్తారు.

మరి ఇలాంటి చైతన్యం దేశాన్ని పిప్పి చేస్తున్న రాజకీయ నాయకుల అవినీతి పై కూడా వస్తే మనదేశం బాగుపడే రోజులు అతి దగ్గర లోనే ఉన్నాయని ఈ చైతన్యం నిలబడాలని ఆశిద్దాం...

 

మరింత సమాచారం తెలుసుకోండి: