తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎన్నో ప్రేమజంటలు వచ్చాయి. ‘ఏం మాయ చేసావే’ చిత్రంతో పరిచయం అయిన అక్కినేని నాగ చైతన్య, సమంతల కొంత కాలంగా ప్రేమించుకున్నారు. ఆటో నగర్ సూర్య, మనం చిత్రంలో జంటగా కనిపించారు. గత సంవత్సరం తమ కుటుంబ పెద్దలతో ప్రేమ వివాహం చెప్పడం వారి దీవెనలు తీసుకోవడం జరిగింది. ఇక వివాహం అంగరంగ వైభవంగా గత రాత్రి గోవాలో జరిగింది.. హిందూ సంప్రదాయ పద్దతిలో జరిగిన ఈ కళ్యాణ్ వేడుకల్లో రాత్రి 11.52 నిమిషాలకు వేద మంత్రాల సాక్షిగా సమంత మెడలో మూడు ముళ్లు వేశాడు చైతన్య.
ఈ మ్యారేజ్కు ఇరు ఫ్యామిలీలకు చెందిన బంధువులు, ఫ్రెండ్స్ మాత్రమే హాజరయ్యారు. అందుకు సంబంధించిన ఫోటోలను నాగార్జున తన ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. శనివారం క్రైస్తవ సంప్రదాయంలో వివాహం జరగనుంది. ఇక తెలుగు సాంప్రదాయం ప్రకారం పెళ్లి అయిన తర్వాత అప్పగింతల కార్యక్రమం చూస్తుంటాం.
కూతురుని అల్లారు ముద్దుగా పెంచుకొని ఓ అయ్యచెతిలో జీవితాంతం రక్షణగా ఉండాలని చెప్పి పంపించే సమయంలో కన్నతల్లిదండ్రలు, బంధువు...పెళ్లి కూతురు కంటతడి పెట్టడం చూస్తుంటాం. ఆ సమయంలో ఎలాంటి వారికైనా..కన్నీరు రాక తప్పదు. కానీ, సమంత పెళ్లి పీఠల మీద కంటతడి పెట్టింది. ఆ సన్నివేశాన్ని ఫోటోగ్రాఫర్ క్లిక్ మనిపించాడు.
అప్పటివరకు బంధుమిత్రులతో హ్యాపీగా గడిపిన సమంత, వున్నట్లుండి కన్నీరు పెట్టడం చూసి..నచ్చిన ప్రేమికుడిని జీవిత భాగస్వామి గా చేసుకున్నందుకా వచ్చిన ఆనంద భాష్పాలా..లేక తల్లిదండ్రులకు దూరమవుతున్నందుకా..ఏంటంటూ అభిమానులు చర్చించుకోవడం మొదలైంది. దీనికి పోస్ట్ చేసిన గంటలో లక్షకు పైగా లైక్స్ వచ్చాయి. కాగా, ఈ రోజు గోవా చర్చిలో సాయంత్రం 4.30 గంటలకు క్రైస్తవ సంప్రదాయ పద్దతిలో వివాహం జరగనుంది.