తెలుగు ఇండస్ట్రీలో మాస్ మహరాజుగా పేరు తెచ్చుకున్న హీరో రవితేజ దాదాపె రెండు సంవత్సరాలు గ్యాప్ తర్వాత అనీల్ రాఘవపూడి దర్శకత్వంలో ‘రాజా ది గ్రేట్’ చిత్రంలో నటించారు.  ఈ చిత్రంలో రవితేజ అంధుడిగా నటించాడు..కానీ ఎక్కడా ఆయన గ్రేజ్ మాత్రం తగ్గకుండా దర్శకుడు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు.  చాలా కాలం తర్వాత మంచి సక్సెస్ చవిచూసిన రవితేజపై ఓ దర్శకుడు తనను మోసం చేశాంటూ ఆరోపిస్తున్నాడు.  వివరాల్లోకి వెళితే..తమిళంలో భోగన్ అనే సూపర్ హిట్ చిత్రానికి దర్శకత్వం వహించాడు లక్ష్మణ్ , అయితే అదే చిత్రాన్ని అదే దర్శకుడి తో రీమేక్ చేయాలనీ అనుకున్నాడు రవితేజ.   
చాలా బాధపడ్డాను
ఆ మద్య వరుస ఫ్లాపులు చవిచూసిన రవితేజ లక్ష్మణ్ తో ఓ సినిమా తీయాలని చూశారు.  కానీ అనుకోకుండా అనీల్ రాఘవపూడి దర్శకత్వంలో ‘రాజా ది గ్రేట్ ’ చిత్రంలో నటించడం అది కాస్త సూపర్ హిట్ కావడంతో ఇప్పుడు లక్ష్మణ్ తో సినిమా క్యాన్సిల్ చేసినట్లు తెలుస్తుంది.  ఇక  భోగన్ సినిమా తెలుగు నేటివిటీ కి , నా ఇమేజ్ కి తగ్గట్లుగా కథ , కథనం మార్చమని లక్ష్మణ్ కు చెప్పాడట ! దాంతో ఆరు నెలల పాటు కష్టపడి మార్పులు చేసానని కానీ తీరా సమయానికి అసలు కారణం చెప్పకుండానే సినిమా ఆపేశారని దానివల్ల చాలా నష్టపోవడమే కాకుండా అవమానంగా ఫీల్ అవుతున్నానని సంచలన వ్యాఖ్యలు చేసాడు లక్ష్మణ్ అనే దర్శకుడు.
బోరుమన్న దర్శకుడు
రాజా ది గ్రేట్ సక్సెస్ తర్వాత తనతో నటించకుండా మరో సినిమాకు రెడీ అయిపోతున్నాడు దాంతో రవితేజ మీద ఆ డైరెక్టర్ కు విపరీతమైన కోపం వస్తోంది.  ఇటీవల రవితేజ నటించిన రాజా ది గ్రేట్ హిట్ కావడంతో భోగన్ రీమేక్ సినిమా నే చేయాలి కానీ డైరెక్టర్ మీద నమ్మకం లేకపోవడంతో ఆ సినిమా చేయనని చెప్పేశాడట రవితేజ.
Image result for భోగన్ దర్శకుడు లక్ష్మణ్
కాగా, రవితేజ సినిమా చేయడానికి నో చెప్పడంతో ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇదే కథను వేరే హీరోతో చేయాలా? లేక మరో ప్రాజెక్టు మొదలు పెట్టాలా? అనే ఒక నిర్ణయానికి రావడానికి కొంత సమయం పడుతుంది అని లక్ష్మణ్ తెలిపారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: