దక్షిణ కొరియన్‌ ప్రముఖ పాప్‌స్టార్‌ కిమ్‌ జోంగ్‌ హ్యున్‌(27) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దక్షిణ కొరియాలోని టాప్‌ రాక్‌ బ్యాండ్స్‌లో ఒకటైన షినీ టీమ్‌లో ప్రధాన గాయకుడైన కిమ్‌ మృతదేహం రాజధాని సియోల్‌ హోటల్‌లో లభ్యమైనట్లు పోలీసులు వెల్లడించారు. తన పాటలతో ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న దక్షిణ కొరియా పాప్‌స్టార్ కిమ్ జోంగ్ హ్యున్ ఆత్మహత్య చేసుకున్నారు.

దక్షిణ కొరియాలోని టాప్ రాక్ బ్యాండ్స్‌లో ఒకటైన షినీ టీమ్‌లో కిమ్ జోంగ్ ప్రధాన గాయకుడిగా ఉండగా.. అతడికి చాలా మంది అభిమానులు ఉన్నారు.గత వారం కూడా సియోల్‌లో జోంగ్  చాలా కచేరీలు నిర్వహించాడు. చనిపోయేముందు జోంగ్ తన సోదరికి మెసేజ్ చేశాడు. ‘ఇదే నా ఆఖరి ఫేర్‌వెల్‌,పరిస్థితులు చాలా కఠినంగా మారాయి, నన్ను వెళ్లనివ్వు’ అని  ఆ మెసేజ్ లో జోంగ్ చెప్పాడు.
Kim
మెసేజ్‌ చూసిన కిమ్‌ సోదరి వెంటనే  పోలీసులకు సమాచారం అందించటంతో పోలీసులు హోటల్‌కి వెళ్లి చూసేసరికి జోంగ్ హ్యున్ అపస్మారక స్థితిలో కన్పించాడు.   ఓ హోటల్‌లో బొగ్గులాంటి పదార్థాన్ని కాల్చి కిమ్ చనిపోయినట్లు పోలీసులు వెల్లడించారు.2015లో కిమ్ విడుదల చేసిన 'బిల్‌బోర్డ్' అనే ఆల్బమ్ వరల్డ్ ఆల్బమ్స్ చార్ట్‌లో మొదటి స్థానం దక్కించుకుంది. మరోవైపు కిమ్ మ‌ృతితో అతడి అభిమానులు దిగ్ర్భాంతికి గురయ్యారు. \



మరింత సమాచారం తెలుసుకోండి: