నందమూరి అభిమానులు ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్న బాలకృష్ణ ‘జై సింహా’ కు సంబంధించిన ఒక షాకింగ్ న్యూస్ ఇప్పుడు మరొకటి ఫిలిం ఇండస్ట్రీ సర్కిల్స్ లో హడావిడి చేస్తోంది. ఈమూవీకి సంబంధించి రీసెంట్‌గా రిలీజైన ట్రైలర్‌ ‘లెజెండ్’ స్థాయిలో లేదని బాలకృష్ణ యాక్టింగ్ డైలాగ్స్ పవర్‌ఫుల్‌గా లేవంటూ చాలామంది బాలయ్య అభిమానులు ఇప్పటికే పెదవి విరిచిన విషయంతెలిసిందే.

 

ఇది చాలదు అన్నట్లుగా ఈమూవీ కధకు సంబంధించి మరోప్రచారం మొదలైంది. ఈ ఫిల్మ్‌ని 1995లో వచ్చిన సూపర్‌‌హిట్‌ ఫిల్మ్ రజినీకాంత్ ‘ముత్తు’ ఆధారంగా తెరకెక్కించారని రైటర్ రత్నం ఇస్తున్న లీకులు బాలకృష్ణ అభిమానులను మరింత గందరగోళంలోకి పడేస్తున్నట్లు టాక్.

 

తెలుస్తున్న సమాచారం మేరకు ఈమూవీ సెకండాఫ్ మొత్తం సెంటిమెంట్‌ తో కూడిన సన్నివేశాలు ఉంటాయని సగటు ప్రేక్షకుడిచేత కన్నీరు పెట్టించడం ఖాయమని చెపుతున్నా ఇలాంటి సెంటిమెంట్ సినిమాలు నేటితరం ప్రేక్షకులు చూస్తారా అనే అనుమానాలు బాలయ్య అభిమానులు వ్యక్త పరుస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ‘ముత్తు’ విడుదలై రికార్డులు సృష్టించినట్లే ‘జై సింహా’ కూడ  బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కావడం ఖాయమని ‘జై సింహా’ యూనిట్ వర్గాలు చెపుతూ ఉన్నా అప్పటికాలంనాటి  ‘ముత్తు’  ను ఇప్పటికాలంనాటి సినిమాగా మార్చడం సాహసం అని బాలయ్య అభిమానులు భయపడుతునట్లు తెలుస్తోంది.

 

 అయితే కథ పరంగా ‘ముత్తు’ ‘జై సింహా’ చాలా వరకు ఒకేలా అనిపించినా దర్శకుడు కె.ఎస్. రవికుమార్ మాత్రం బాలకృష్ణ పాత్రను డిఫెరెంట్ చూపెడుతున్నట్లు టాక్. దీనితో ‘శాతకర్ణి’ విజయం తరువాత దర్శకుడు పూరీతో సినిమాను చేసి క్రేజ్ పోగొట్టుకున్న బాలకృష్ణ ఈసారి మళ్ళీ అదేరకం తప్పు రవికుమార్ తో చేస్తున్నాడా అంటూ బాలయ్య అభిమానులు తలపట్టుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: