గత కొన్ని రోజుల నుంచి ఎన్నో వివాదాల్లో చిక్కుకొని వాయిదాపడ్డ ‘పద్మావతి’ చిత్రం ‘పద్మావత్’గా పేరు మార్చుకొని జనవరి 25న విడుదల కాబోతుంది. ఈ విషయాన్ని బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్విట్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించాడు.ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం పద్మావతి.
ఈ మూవీ షూటింగ్ మొదలైనప్పటి నుండి అనేక వివాదలతో వార్తలలో నిలుస్తూనే ఉంది. కర్ణిసేన ఈ చిత్రాన్ని విడుదల కానివ్వమని పట్టుబట్టుకు కూర్చుంటే దర్శక నిర్మాతలు మాత్రం మూవీ రిలీజ్ కోసం చాలా ప్రయత్నాలు చేశారు.ఇక ఈ మూవీ విడుదలైతే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందన్న ఉద్దేశంతో ఉత్తరప్రదేశ్ - రాజస్థాన్ - మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రులు అభిప్రాయపడ్డారు.
సెన్సార్ ను కూడా సమయానికి పూర్తి చేయకపోవడంతో ఈ చిత్రాన్ని వాయిదా వేసింది చిత్ర బృందం. ఇటీవలే ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాల్ని కూడా పూర్తి చేసుకున్నట్లు సమాచారం.చిత్రాన్ని తిలకించిన సెన్సార్ సభ్యులు ఈ చిత్రంలో వివాదాస్పదమైన సన్నివేశాలని తొలగించాల్సిందిగా చిత్ర బృందానికి తెలిపారు. విడుదల విషయం పై చిత్ర బృందం అధికారిక ప్రకటన చేయనుంది.
జనవరి 25 లేదా 26 తేదీలలో చిత్రం తప్పక విడుదల అవుతుందని చిత్ర యూనిట్ చెబుతున్నట్టు తెలుస్తుంది. కాని దేశంలోని రాజ్పుత్ తెగకి చెందిన వారందరు, సినిమాని పూర్తిగా నిషేదించేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది.