'అజ్ఞాతవాసి' రిజల్ట్ కేవలం పవన్ అభిమానులకు మాత్రమే కాకుండా జూనియర్ ఎన్టీర్ అభిమానులను  కూడ కలవర పాటుకు గురిచేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ఈ కలవరపాటును జూనియర్ అభిమానులు సందేశాలుగా మార్చి తమ సెల్ ఫోన్స్ ద్వారా జూనియర్  దృష్టికి తీసుకు వస్తున్నట్లు టాక్.  ప్రస్తుతం జూనియర్ అభిమానులు ఇలా టెన్షన్ లోకి వెళ్లి పోవడానికి గల కారణం త్రివిక్రమ్ తన నెక్ట్స్ సినిమాను యంగ్ టైగర్ తో ప్లాన్ చేయడమే.

 

'అజ్ఞాతవాసి' ని అడ్డదిడ్డంగా తీసిన త్రివిక్రమ్ ఎన్టీఆర్  తో చేయబోయే సినిమాను ఇంకెంత ఆనాలోచితంగా తీస్తాడేమో అని తారక్ అభిమానులు భయపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే వాస్తవానికి ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమాకు సంబంధించి స్టోరీ డిస్కషన్లు పూర్తయ్యాయి. మూవీ కూడా లాంచ్ అయింది. అయితే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి స్క్రిప్ట్ అదేవిధంగా పూర్తి  స్క్రీన్ ప్లే రెడీ కాలేదు అని వార్తలు వస్తున్నాయి.

 TRIVIKRAM LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం

ఈ పరిస్థితుల నేపధ్యంలో 'అజ్ఞాతవాసి' నేర్పిన అనుభవాలతో జూనియర్ త్రివిక్రమ్ ల మూవీ స్క్రిప్ట్ విషయంలో చాలా మార్పులు జరిగే ఆస్కారం ఉంది అని అంటున్నారు. ముఖ్యంగా  'అజ్ఞాతవాసి'   స్క్రీన్ ప్లే విషయంలో త్రివిక్రమ్ చేసిన పొరపాట్లకు చాలా భారీ  మూల్యం చెల్లించు కోవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనితో 'అజ్ఞాతవాసి'  స్క్రిప్ట్ విషయంలో పవన్ త్రివిక్రమ్ ను పూర్తి గా వదిలి వేసినట్లుగా జూనియర్ త్రివిక్రమ్ ను వదలడు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

 సంబంధిత చిత్రం

దీనికితోడు ఫ్లాప్ ఇచ్చిన డైరక్టర్ ను మొహమాటం లేకుండా పక్కనపెట్టగల తెగింపు నేర్పు ఎన్టీఆర్ కు ఉంది అన్న ప్రచారం కూడ ఎప్పటి నుంచో ఉంది. గతంలో కొంతమంది దర్శకుల విషయంలో ఇలా జూనియర్  ప్రవర్తించిన సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే ఇక్కడ వ్యవహారం టాప్ డైరెక్టర్ త్రివిక్రమ్ తో కాబట్టి జూనియర్ చాలా వ్యూహాత్మకంగా  త్రివిక్రమ్ తో తన సినిమాకు సంబంధించి  స్టోరీ, స్క్రీన్ ప్లే, మేకింగ్ విషయాలు అన్నీ దగ్గర ఉండి చూసుకునే అవకాసం ఉంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఏమైనా  'అజ్ఞాతవాసి' ఎందరికో పాఠాలు నేర్పిన  మూవీగా మారిపోయింది..

 


మరింత సమాచారం తెలుసుకోండి: