టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రేసు గుర్రం తర్వాత నిజంగా రేస్ లోకి వచ్చాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘రేసు గుర్రం’ మొదటి మూడు రోజులు పెద్దగా టాక్ రాకపోయినా..తర్వాత ఒక్కసారిగా ఊపు అందుకుంది. ఆ తర్వాత బోయపాటి దర్శకత్వంలో వచ్చిన ‘సరైనోడు’ కూడా మొదట ఫ్లాప్ అన్నారు..యావరేజ్ అన్నారు.
ఒక్క వారంలోనే సూపర్ డూపర్ హిట్ చేశారు..ఈ సినిమా కూడా స్లోగా పికప్ అయ్యింది. ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫామ్ దృశ్యా మిగిలిన హీరోల కన్నా రెండు అడుగులు ముందే ఉన్నాడు… యావరేజ్, బిలో యావరేజ్ టాక్ తోనూ బాక్స్ ఆఫీస్ దుమ్ము దుమారం చేస్తూ సంచలన కలెక్షన్స్ తో హిస్టారికల్ రికార్డులు క్రియేట్ చేస్తు న్నాడు.
గత సంవత్సరం దువ్వాడ జగన్నాథం ఎన్నో కాంట్రవర్సీలకు గురైనా థియేటర్లో రిలీజ్ తర్వాత అన్నీ పక్కనబెట్టి సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. బన్నీ కెరీర్ లో దువ్వాడ జగన్నాథం లాంటి యావరేజ్ సినిమాల తోనే ఈజీగా 70 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి దుమ్మురేపింది. ఈ టైమ్ లో అల్లు అర్జున్ పాజిటివ్ టాక్ ఉన్న ఒక్క సినిమా పడితే మనోడు ఏ రేంజ్ భీభత్సం సృష్టిస్తాడా అని అందరు ఎదురు చూస్తున్నారు.
వక్కంతం వంశీ డైరెక్షన్ లో చేయబోయే సినిమా ‘నా పేరు సూర్య’ ఈ రేంజ్ లోనే ఉంటుందని అందరు విశ్వసిస్తున్నారు. ఈ సినిమా హిట్ టాక్ వస్తే..బన్నీ చరిత్ర సృస్టించడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్