యువరత్న నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కి సంక్రాంతికి రిలీజ్ అయిన జై సింహా సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ టాక్తో సినిమా ప్రి రిలీజ్ బిజినెస్కు తగినట్టుగా పెర్పామ్ చేస్తోంది. గత రెండు సంక్రాంతిలకు వరుసగా డిక్టేటర్, గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ కొట్టిన బాలయ్య ఈ యేడాది జై సింహాగా బాక్సాఫీస్ మీదకు దూకాడు.
ఈ సంక్రాంతికి వచ్చిన నాలుగు సినిమాల్లోనూ జై సింహాకే మంచి టాక్ ఉంది. పవన్ అజ్ఞాతవాసి డిజాస్టర్ కావడం, సూర్య గ్యాంగ్కు తమిళ ప్లేవర్ ఎక్కువ అవ్వడం, రంగులరాట్నం సినిమాకు మంచి టాక్ లేకపోవడంతో జై సింహాకు కలిసొచ్చింది. బీ, సీ సెంటర్లతో జై సింహా మంచి వసూళ్లు రాబట్టడంతో పాటు బాలయ్య అభిమానులను మెప్పించే సినిమా కావడం, సెంటిమెంట్ బాగుండడం జై సింహాకు బాగా కలిసొచ్చింది.
తొలి రోజు వరల్డ్ వైడ్గా రూ 8.25 కోట్లు కొల్లగొట్టిన ఈ సినిమా మొదటి నాలుగు రోజులకు ఏపీ, తెలంగాణల్లో రూ.16.13 కోట్ల షేర్ రాబట్టింది. ఇక కర్ణాటకలో రూ.2.40 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్లో రూ.1.2 కోట్లు కలిపి మొత్తంగా రూ.19.73 కోట్ల షేర్ రాబట్టింది. సీకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై సీ కళ్యాణ్ నిర్మించిన ఈ సినిమాకు కేఎస్.రవికుమార్ దర్శకత్వం వహించారు.
ఈ సినిమాలో బాలయ్య సరసన నయనతార, నటాషా దోషీ, హరిప్రియ హీరోయిన్లుగా నటించారు. ఇక ఈ సినిమా టోటల్ బిజినెస్ రూ.27 కోట్లు కావడంతో పాటు పండగ సెలవులు మరో మూడు నాలుగు రోజులు ఉండడంతో ఈ సినిమా బయ్యర్లు బ్రేక్ ఈవెన్కు దగ్గరవుతోంది.