టాప్ హీరోయిన్ గా కొంతకాలం ఒక వెలుగువెలిగిన రోజా అప్పట్లో  టాప్ హీరోలు అందరితోను నటించింది. సినిమాలు నుంచి దూరం అయ్యాక ఆమె రాజకీయాలలో ప్రముఖ ఛానల్స్ ప్రసారం చేసే అనేక కార్యక్రమాలలో ఎప్పుడు బిజీగా ఉండటంతో ఇప్పటికీ రోజా చేసే కామెంట్స్ అందరి దృష్టిని ఆకర్షిస్తూ హాట్ టాపిక్ గా మారుతూనే ఉన్నాయి.

 ROJA LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం

ఈనేపధ్యంలో ఒకప్రముఖ మీడియా సంస్థ  దాదాపు 22 ఏళ్ల క్రితం వెంకటేష్ రోజాల మధ్య జరిగిన ఇగో వార్ కు సంబంధించిన ఒక ఆసక్తికర విషయాన్ని లేట్ గా వెలుగులోకి తీసుకువచ్చింది. రోజా తనభర్త సెల్వమణితో కలిసి వెంకటేష్ హీరోగా తాను హీరోయిన్ గా ‘చినరాయుడు' టైటిల్ తో ఒక సినిమా తీద్దామనుకున్నారట. అయితే కొన్ని కారణాలవల్ల ఆప్రాజెక్టు అప్పట్లో వర్కౌట్ కాలేదు. అదే చిత్ర కథాంశంతో విజయశాంతితో కలిసి వెంకటేష్ ‘చినరాయుడు' చిత్రంలో నటించాడు.

 ROJA LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం

దీనితో రోజాకు అప్పట్లో చాల కోపం వచ్చిందట. ఇలా చేశావేంటి అని వెంకటేష్‌ను రోజా అప్పట్లో నిలదీసిందట. అదంతా నిర్మాతల నిర్ణయమని తన ప్రమేయంలేదంటూ వెంకటేష్ సమాధానం ఇచ్చినట్లు టాక్. ఆతర్వాత కోదండ రామిరెడ్డి దర్శకత్వంలో ‘పోకిరి రాజా' అనే చిత్రం వెంకటేష్-రోజా కాంబినేషన్లో తీస్తున్నప్పుడు ఆషూటింగ్ కోసం రోజాను బాంబే తీసుకెళ్లి మూడురోజుల పాటు ఏషూటింగ్ లేకుండా హోటల్‌లో ఖాళీగా ఉంచారట.  

 Image result for venkatesh

దీనితో విసుగు చెందిన రోజా ఇదేమిటి అని ప్రశ్నిస్తే ఆసినిమా నిర్మాతల నుండి సరైన సమాధానం రాకపోవడంతో మూడురోజులు ఖాళీగా ఉన్న రోజా తన భర్త సెల్వమణి బర్త్ డే అని చెప్పి ఎవరికీ చెప్పకుండా చెన్నై వెళ్లిపోయిందట. దీనితో షాక్ అయిన ఆసినిమా నిర్మాతలు   ఎంతో బ్రతిమాలడం ఆతరువాత  వెంకటేష్ స్వయంగా ఫోన్ చేసిన తరువాత మాత్రమే ఆమూవీ షూటింగ్ కు వచ్చి తనపాత్రను కంప్లీట్ చేసిందట రోజ.

Image result for venkatesh roja

దీనితో అప్పటి నుండి ఇప్పటి వరకు రోజా - వెంకటేష్ మధ్య మాటలు లేవు అని ఆసక్తికరమైన అప్పటి విషయాలు ఇప్పడు లేట్ గా వెలుగులోకి రావడంతో రాజకీయాలలోనే కాదు సినిమాహీరోల పట్ల కూడ రోజ ఫైర్ బ్రాండ్ అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: