అజ్ఞాతవాసి’ ఫెయిల్ అవ్వడంతో ఇక మెగా అభిమానుల ఆశలు అన్నీ రామ్ చరణ్ ‘రంగస్థలం’ పై ఉన్నాయి. దీనికి తగ్గట్టుగా అంచనాలు అందుకోవాలని చరణ్ ఈసినిమాకు విపరీతంగా కష్టపడుతున్నాడు. మార్చి 30వ తారీఖున ఉగాది పండుగను టార్గెట్ చేస్తూ ఈమూవీ విడుదలకు అన్ని ఏర్పాట్లు ఇప్పటి నుంచే పూర్తి చేస్తున్నారు.

 RAM CHARAN IN RANGASTHALAM MOVIE LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం

అయితే అనూహ్యంగా ఈసినిమాను మరో రెండు సినిమాలు కార్నర్ చేయడం ప్రస్తుతం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న ‘ఎమ్.ఎల్.ఎ’ అదేవిధంగా మహానటి సావిత్రి జీవిత కథతో నిర్మిస్తున్న కీర్తి సురేశ్ ‘మహానటి’ సినిమాలు కూడ మార్చి 29న విడుదల కావడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాయి.

 సంబంధిత చిత్రం

సంక్రాంతితో పోల్చుకుంటే ఉగాది ఒకరోజు పండుగ మాత్రమే. దీనికితోడు మార్చి నెలాఖరులో విద్యార్ధులు అంతా పరీక్షల బిజీలో ఉంటారు. ఇలాంటి పరిస్థుతులలో ఒక సినిమాకు మంచి స్థాయిలో కలక్షన్స్ రావడమే కష్టమైన విషయం. అయితే దానికి భిన్నంగా మూడు సినిమాలు ఒకేసారి విడుదల కావడంతోపాటు చరణ్ ‘రంగస్థలం’ ను రౌండప్ చేయడం హాట్ న్యూస్ గా మారింది.  

 సంబంధిత చిత్రం

ఇప్పటికే టాప్ హీరోల సినిమాలు అన్నీ వరస పరాజయాలు చూస్తున్న నేపధ్యంలో ‘రంగస్థలం’ మూవీని అత్యంత భారీ అంచనాలతో భారీ మొత్తాలు పెట్టి కొనుక్కున్న బయ్యర్లు టెన్షన్ పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది చాలదు అన్నట్లుగా పెద్దగా ఇమేజ్ లేని కళ్యాణ్ రామ్ కేవలం క్రేజీ హీరోయిన్ గా మాత్రమే కొనసాగుతున్న కీర్తి సురేష్ ఇలా ఇద్దరూ కలిసి ఒకేసారి రామ్ చరణ్ ను టార్గెట్ చేయడం మెగా అభిమానులకు కూడ టెన్షన్ తో పాటు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నట్లు టాక్.. 




మరింత సమాచారం తెలుసుకోండి: