నాలుగు నెలలుగా మీడియాకు హాట్ టాపిక్ గా మారడమే కాకుండా పవన్ అభిమానులను కుదిపేసిన కత్తి మహేష్ పవన్ అభిమానుల వివాదానికి శుభం కార్డు పడింది. రాజకీయాలలో సినిమారంగంలో ఎవరికి ఎవరు శాశ్వత శత్రువులుగా శాశ్వత మిత్రులుగా ఉండరు అనే విషయాన్ని మరోసారి రుజువు చేస్తూ ఈవివాదం అనేక మలుపులు తిరిగి ఎవరు ఊహించని విధంగా రాజీ అయిపోయింది.

 'కత్తి' కోసం మరో లేఖ:

ముఖ్యంగా గత కొద్దిరోజులుగా టీవి ఆన్ చేస్తే చాలు ఈ విషయం పై తప్పించి మరి ఏవిషయం పైనా చర్చలు కనిపించక పోవడంతో ఈ వ్యవహారం అత్యంత హాట్ టాపిక్ గా మారింది. అయితే  అనూహ్యంగా ఈ కథ సుఖాంతమవడంతో పవన్ అభిమానులు తెరిపిన పడేలాచేసింది.   పవన్‌ కల్యాణ్ అభిమానులు కత్తి మహేష్ తో తీయించుకున్న ఒక సెల్ఫీతో ఈ వివాదానికి ముగింపు  పలికారు.   

 KATHI MAHESH LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం

ఒకరికొకరు స్వీట్లు తినిపించుకుని మరీ ఈ వివాదానికి ముగిపు పలికినట్లు వార్తలు వస్తున్నాయి.   ఈ పరిణామం చాలామందికి ఆశ్చర్యంగానే ఉన్నా ఎట్టకేలకు ఈవివాదం ముగింపుకు రావడం శుభపరిణాం అంటున్నారు. ‘నా పైన దాడి చేసిన పరిపక్వత లేని, పేద, పవన్ కళ్యాణ్ అభిమానులను శిక్షించడం నా ఉద్దేశం కాదు. ఆ ఇద్దరిలో ఒక దళితుడు ఉండటం కడు శోచనీయం. పవన్ కళ్యాణ్ మరియు జనసేన ఇప్పుడిప్పుడే నేను ఆశించిన దిశగా అభిమానులకు, శ్రేణులకు మార్గదర్శకాలు ఇవ్వడం మొదలుపెట్టారు. ఈ పరిస్థితుల్లో గైడెన్స్ లేని పిచ్చి అభిమానంతో నాపై దాడిచేసిన వారిని శిక్షించడానికి కాకుండా వారిని సంస్కరించడానికి నేను నైతికంగా ప్రయత్నిస్తూ నా కేసును ఉపసంహరించుకుంటున్నాను. ఇక నాపై దాడిని ఖండించడం క్షమాపణలు చెప్పడం పవన్ కళ్యాణ్ విజ్ఞతకే వదిలేస్తున్నాను అంటూ మహేష్ తన ట్విట్ ముగించాడు.

 KATHI MAHESH LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం

దీనికితోడు పవన్ అభిమానులు కుడా కత్తి మహేష్ తో సెల్ఫీలు తీసుకుని ఇకపై కత్తి మహేష్‌ కు తమకు ఎలాంటి గొడవలు ఉండబోవని ప్రకటించారు. అయితే పవన్ నుంచి నేరుగా క్షమాపణ డిమాండ్ చేసిన మహేష్ కత్తి ‘జనసేన’ నాయకులతో పవన్  అభిమానులతో చర్చల్లో మెత్తబడటం గమనార్హం. అయితే ఈ అనుకోని పరిణామాల వెనుక ఏదో ఒక వ్యూహాలు ఉన్నాయి అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: