టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏర్పడిన క్రేజీ హీరోయిన్స్ సమస్యకు అను ఎమ్మానుయేల్ ఒక పరిష్కారం అంటూ చాలామంది దర్శక నిర్మాతలు భావించారు. దీనికితోడు ఈ ఏడాది టాప్ హీరోయిన్ స్టేటస్ కు అను ఎమ్మానుయేల్ ఎదిగిపోతుంది అంటూ మీడియాలో కథనాలు కూడ వచ్చాయి.

 

అయితే అందరి ఊహలను తలక్రిందులు చేస్తూ ఆమె పవన్ తో నటించిన ‘అజ్ఞాతవాసి’ ఫెయిల్ కావడం ఇప్పుడు శాపంగా మారింది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఈమె అల్లుఅర్జున్ తో నటించిన ‘నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా’ మూవీ పై భారీ అంచనాలు ఉన్నా ఒకేసారి అను ఎమ్మానుయేల్ ను తప్పించి మరో క్రేజీ హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న కియారా అద్వానీ వైపు చాలామంది దర్శక నిర్మాతలు చూస్తూ ఉండటం హాట్ టాపిక్ గా మారింది.

 

kaira advani latest photos కోసం చిత్ర ఫలితం
వాస్తవానికి కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న ‘భరత్ అను నేను' హీరోయిన్ గా కియారా అద్వానీ నటిస్తూ ఉన్నా ఆమె నటన పై కానీ అదేవిధంగా ఆమె గ్లామర్ పై కానీ ఎటువంటి క్లారిటీ టాలీవుడ్ ప్రేక్షకులకు లేదు. అయినా ఈ విషయాలను పట్టించుకోకుండా చరణ్ సినిమాను తీయబోతున్న బోయపాటి ఎన్టీఆర్ తో సినిమాను చేయబోతున్న త్రివిక్రమ్ ప్రస్తుతం కియారా అద్వానీ తో చర్చలు చేస్తున్నట్లు టాక్.

 kiara advani latest photos కోసం చిత్ర ఫలితం

దీనితో అనూ ఎమ్మానుయేల్ కు కియారా అద్వానీ శాపంగా మారింది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఏమైనా ‘అజ్ఞాతవాసి’ పవన్ ఇమేజ్ కి మాత్రమే కాదు అనూ ఎమ్మానుయేల్ కు కూడ శాపంగా మారింది అనుకోవాలి..    

 


మరింత సమాచారం తెలుసుకోండి: