మెగా మేనళ్లుడు సాయిధరమ్ తేజ్, వినాయక్ కాంబోలో తెరకెక్కిన ఇంటిలిజెంట్ సినిమా రేపు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ అవుతోంది. ఈ సినిమా హీరో సాయిధరమ్ సినిమాకు ధర్మాభాయ్ అనే టైటిల్ పెట్టాలని చెపితే వినాయక్ మాత్రం హీరో మాటనే పక్కన పెట్టి ఇంటిలిజెంట్ టైటిల్ పెట్టినట్టు టాక్. ఇక ఈ సినిమాలో తన క్యారెక్టర్కు ధర్మా భాయ్ అనే పేరు ఎలా వచ్చిందో ? కూడా చెప్పాడు సాయి.
తన క్యారెక్టర్కు ధర్మా భాయ్ అనే పేరు ఎందుకు పెట్టారని వినాయక్ను అడిగితే దానికి వినాయక్ గారు ఇలా సమాధానం ఇచ్చారని కూడా సాయి చెప్పాడు. తన సినిమాల్లో వినాయక్ హీరోల ఒరిజినల్ పేర్లనే పెడుతుంటారు. ఇది ఆయనకు ఇష్టమట. నాయక్ లో చరణ్ పేరు చెర్రీ అని పెట్టారు. ఖైదీనంబర్-150లో చిరంజీవి పేరు శంకర్ అని పెట్టేశారు. ఈసినిమాలో నా ఒరిజినల్ పేరు ధరమ్ తేజ్ అనే పేరునే వాడారు.
ఇక ఆ పేరు నుంచే కథకు తగినట్టుగా కూడా ధర్మా భాయ్ పేరు వచ్చిందని సాయి చెప్పాడు. ఇక ఈ సినిమా కథలో హీరో, విలన్ల మధ్య మైండ్ గేమ్ అద్భుతంగా ఉంటుందని... ఆ మైండ్ గేమ్కు తగ్గట్టే ఇంటిలిజెంట్ అని టైటిల్ ఫిక్స్ చేశారని సాయి చెప్పాడు. తన సినిమాలకు థమన్ మ్యూజిక్ ఇస్తే, అందులో పాటలు హిట్, సినిమా మాత్రం ఫట్ అవుతుందని, అయితే ఇంటిలిజెంట్ మాత్రం అలా అవ్వదని సాయి చెప్పారు.
సీకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై సీ కళ్యాణ్ నిర్మించిన ఈ సినిమాలో సాయి సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్గా నటించింది. ఇక సినిమా ఓవరాల్గా వినాయక్ స్టైల్లో పక్కా మాస్ అండ్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్గా నిలుస్తుందని చిత్ర యూనిట్ చెపుతోంది.