టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు '7/జీ బృందావన్ కాలనీ' ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలుసు. ఇక సినిమా ఇండస్ట్రీలో ఈ మద్య స్టార్ హీరోలు, డైరెక్టర్లు, నిర్మాతల తనయుడు హీరోలుగా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఇండస్ట్రీలో ఎంత మంచి బ్యాగ్ గ్రౌండ్ ఉన్నా కొంత మంది వారసులు మాత్రం హీరోగా రాణించలేక పోతున్నారు.
కెరీర్ బిగినింగ్ లో ఒకటీ రెండు సినిమాలు హిట్ అయినా..తర్వాత కంటికి కనిపించకుండా పోతున్నారు. తెలుగు, తమిళ ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ గా ఏఎమ్ రత్నం అందరికీ సుపరిచితుడే..ఆయన తనయుడు రవికృష్ణ హీరోగా ఎంట్రీ ఇచ్చి '7/జీ బృందావన్ కాలనీ'తో కోలీవుడ్తో పాటు ఇటు టాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించాడు. ఆ తరువాత కొన్ని తమిళ సినిమాలతో పాటు తెలుగులో 'బ్రహ్మానందం డ్రామా కంపెనీ', 'నిన్న నేడు రేపు' అనే రెండు తెలుగు చిత్రాలలో కూడా నటించాడు.
కానీ ఏ ఒక్క సినిమా కూడా మనోడికి మంచి పేరు తీసుకు రాలేదు. దీంతో సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వస్తున్నాడు. రవికృష్ణ నటించిన సినిమాలు పెద్దగా హిట్ కాకపోవడంతో ఇతర సినిమాలో చాన్సులు కూడా రాలేదు. అదృష్టం కలిసి రాకపోవడంతో గత ఏడేళ్లుగా సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నాడు. ఇదిలా ఉంటే ఈ మద్య రవికృష్ణకు సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
సినిమాలకు దూరమయ్యాక ఇంటిపట్టునే ఉన్న రవికృష్ణ.. ఇప్పుడు చాలా బొద్దుగా తయారయ్యాడు.ఇక రవికృష్ణ సోదరుడు జ్యోతి కృష్ణ నిర్మాతగా, దర్శకుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. అయితే రవికృష్ణ అలాంటి ప్రయత్నాలు కూడా ఏమీ చేయనట్లు తెలుస్తోంది